
కావలసిన పదార్థాలు:
చేపముక్కలు: 6-8
ఎండుమిర్చి: 4-6
కొబ్బరి తురుము: 3
మైదా పిండి: 4
నిమ్మరసం: 2
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు: 4-6
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా చేప ముక్కలను శుభ్రం చేసి ఆరబెట్టాలి. తడి పూర్తిగా ఆరిన తర్వాత మైదా పిండిని వాటిమీద చల్లి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఎండు మిర్చి, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్ప లను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని చేప ముక్కలకు పట్టించాలి. వీటిని అరగంట సేపు అలాగే ఉంచాలి
3. అరగంట తర్వాత స్టౌ పాన్ పెట్టి నూనె పోసి కాగాక. అందులో చేప ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కోకోనట్ ఫిష్ ఫ్రై రెడీ. సర్వ్ చేసే ముందు నిమ్మరసం చల్లి వడ్డించాలి.













