
కావలసిన పదార్ధాలు:
గోధుమరవ్వ: 1cup
పెసరపప్పు: 1cup
సేమ్యా: 1/2cup
పాలు: 1lts
పంచదార: 2cups
పచ్చికొబ్బరి తురుము: 1cup
పచ్చకర్పూరం: చిటికెడు
యాలకుల పొడి: 1tsp
నెయ్యి: 1/2cup
జీడిపప్పు, ఎండుద్రాక్ష: 1/4cup
తయారు చేయు విధానం
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేడి చేసి, గోధుమ రవ్వ, సేమ్యాను విడివిడిగా వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు, ద్రాక్షను కూడా వేయించి పెట్టుకోవాలి.
2. తరువాత పళ్లెంలో నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాలు తీసుకుని అందులో పెసర పప్పు తగినన్ని నీళ్లు పోయాలి. పప్పు కొంచెం ఉడికాక పంచదార, సేమ్యా, గోధుమరవ్వ వేసి మరికాసేపు ఉడికించాలి.
4. తరువాత పచ్చికొబ్బరి తురుము, జీడిపప్పు ఎండుద్రాక్ష కలపాలి. ఈ పాయసం చల్లారాక మంరింత రుచిగా ఉంటుంది. అంతే వేడి వేడి గోధుమరవ్వ పాయసం రెడీ. పండుగ పూట వెరైటీగా ఉండే ఈ గోధుమరవ్వ పాయసాన్ని మీరూ ట్రై చేయండి.













