Just In
- 42 min ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 3 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 11 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 12 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
Don't Miss
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
నవరాత్రి స్పెషల్-బాదూషా తయారీ విధానం (వీడియోతో)
నవరాత్రులంటే మనందరికీ ఇష్టమే, ఈపాటికే ఏర్పాట్లు మొదలయిపోయుంటాయి కదా.నవరాత్రుల ఏర్పాట్లంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుర్గా మాత విగ్రహాల తయారీ మాత్రమే కాదు, రక రకాల పిండివంటల తయారీ కూడా.అందుకే సులభంగా మీరు ఈ నవరాత్రుల్లో తయారు చేసుకోవడానికి బాదూషా తయారీ ఇచ్చాము.బాదూషా తయారీ అంటే చాలా కష్టమని మనలో చాలామంది భావిస్తారు, కానీ చాలా సులభం తెలుసా??
క్రింద మేము ఇచ్చిన వీడియో లో బాదూషా ఎలా చెయ్యాలో వివరంగా వివరించబడింది.ఇంక ఆలశ్యమెందుకు, నోరూరించే బాదూషా చేసేయ్యండి మరి.
బాదూషా తయారీకి ముందు అన్నీ సిద్ధం చేసుకోవడానికి పట్టే సమయం:20 నిమిషాలు
బాదూషా తయారీకి పట్టే సమయం:30 నిమిషాలు
ఎంత మందికి సరిపోతుంది:4
కావాల్సిన పదార్ధాలు:
- మైదా-ఒక కప్పు
- నెయ్యి-రెండు టీస్పూన్లు
- బేకింగ్ సోడా-చిటికెడు
- పెరుగు/యోగర్ట్-అర కప్పు
- పంచదార- ఒక కప్పు
- నీళ్ళు-ఒక కప్పు
- ఏలకుల పొడి-చిటికెడు
- నూనె-వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
1.ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు/యోగర్ట్,నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
2.ఒక వెడల్పాటి గిన్నెలో మైదా వేసి దానిలో మెల్లిగా పెరుగు వేస్తూ చపాతీ పిండిలా కలపాలి.
3.ఈ కలిపిన పిండిని పది నిమిషాలు నాననివ్వాలి.
4.గిన్నెలో నీళ్ళు తీసుకుని దానిలో పంచదార వేసి పంచదార పాకం వచ్చేంతవరకూ మరిగించాలి.పాకం తయారీలో స్టౌ మంట సన్నగా ఉండాలి.పల్చటి సిరప్ లా అయ్యేవరకూ నీళ్ళూ పంచదార మీశ్రమాన్ని స్టౌ మీద ఉంచాలి.
6.పాకం వచ్చాకా స్టౌ కట్టేసి ఏలకుల పొడి కలపాలి.
7.కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాటీస్ లాగ చెయ్యాలి.కావాలనుకుంటే ప్యాటీల చివర్లు లోపలకి మడిచి అందంగా కూడా తయారుచేసుకోవచ్చు.
8.మూకుడులో నూనె వేడి చేసి,ఈ ప్యాటీలని మెల్లిగా నూనెలో వెయ్యాలి.
9.సన్నని సెగ మీద బాదూషా పూర్తిగా వేగేవరకూ వేయించుకోవాలి.
10.బ్రౌన్ కలర్ వచ్చాకా బాదూషా ని నూనెలో నుండి తీసి 2-3 నిమిషాలు పక్కన ఉంచాలి.
11.పక్కన పెట్టుకున్న బాదుషాలని పంచదార పాకంలో వేసి రాత్రంతా నాననివ్వాలి.
12.మరునాడు డ్రై ఫ్రూట్స్ తో అలకరించుకుని ఈ నవరాత్రుల్లో నోరూరించే బాదుషాని ఆస్వాదించండి.