Just In
- 33 min ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 3 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 5 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 6 hrs ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
ఆశ్చర్యం పంచ పాండవులులకు ఒక్కొక్కరికి ఒక్కో తండ్రా..!?
పాండవులు కురువంశ రాజు, పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు అని మనందరికీ తెలుసు. రాజు యొక్క మొదటి భార్య, కుంతీదేవి సంతానం యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. కవలలు అయిన నకులుడు మరియు సహదేవుడు రెండవ భార్య మాద్రికి జన్మించారు. అయితే, ఇది మొత్తం నిజం కాదు. నిజానికి పాండవులక్కొక్కరికి ఒక్కొక్క దైవిక తండ్రి ఉన్నారు ఎందుకంటే పాండు మహారాజుకు శాపం కారణంగా తండ్రి అయ్యే యోగ్యత లేదు.
అందువలన, యుధిష్ఠిరుడి తండ్రి యముడు; భీముడి తండ్రి వాయుదేవుడు; అర్జునుడి తండ్రి ఇంద్రుడు మరియు కవలలు అయిన నకులుడి మరియు సహదేవుడి తండ్రులు దివ్య అశ్వినీ కవలలు. ... పాండవులు ఒక్కొక్కరు ఎలా జన్మించారు అని తెలుసుకోవటానికి ఈ స్లయిడ్ షో పై క్లిక్ చేయండి.
1. యుధిష్ఠిరుని పుట్టుక
పాండురాజు యొక్క వైకల్యం తరువాత, యుధిష్ఠిరుడు అసాధారణమైన రీతిలో ఉద్భవించాడు. అతని తల్లి కుంతి యవ్వనంలో ఉన్నప్పుడు, ఋషి దూర్వాసుడు ద్వారా దేవుళ్ళను అర్థించడానికి వరం ఇచ్చాడు. ఆమె భర్త అయిన పాండురాజు ఆమెను వరాలను ఉపయోగించమని చేసిన అభ్యర్థన మేరకు ఒక్కొక్క దేవుడిని ఆవాహన చేసుకున్నప్పుడు వారు ఆమెను పిల్లలతో అనుగ్రహించారు. కుంతిదేవి, యమధర్మరాజును (యముడు అని కూడా పిలుస్తారు) ఆవాహన చేసుకున్నప్పుడు ఆమెకు యుధిష్ఠిరుడు జన్మించాడు.
2. భీముడి పుట్టుక
కుంతీదేవి వరాలను ఉపయోగించడానికి పాండురాజు చేసిన అభ్యర్థన మేరకు, ఆమె వాయుదేవుడిని ప్రేరేపించడం ద్వారా భీముడికి జన్మనిచ్చింది. ఇతర పాండవ సోదరులతోపాటు, భీముడు కురు నియమాలు, మతం, సైన్స్, పరిపాలన మరియు సైనిక కళలలో కృపాచార్యుడు, ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందాడు. ముఖ్యంగా, అతను బాణాకర్రను ఉపయోగించడంలో మంచి నైపుణ్యత సంపాదించాడు. పురాణం అంతటా భీముడి యొక్క బలమైన స్థానం మహోన్నతంగా ఉన్నది.
3. అర్జునుడి పుట్టుక
మహాభారతం అర్జునుడు జన్మించినప్పుడు దేవతలు పాడారు అని చెపుతున్నది, అతను ఇంద్రుడి యొక్క కుమారుడు (జ్యూస్ వంటి దేవతల కమాండర్). అతను కురు, ద్రోణాచార్యుడి (తన ఉత్తమ విద్యార్థి అర్జునుడిని భావించినవాడు) వంటి గురువుల వొద్ద మతం, సైన్స్, పరిపాలన మరియు సైనిక కళలలో శిక్షణ పొందాడు.
4. నకులుడు మరియు సహదేవుడి జననం
నకులుడు మరియు సహదేవుడి తండ్రి అశ్విన్స్ అని చెబుతారు. కాబట్టి, ఈ అశ్విన్స్ ఎవరు? చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం గురించి తెలీదు. ఋగ్వేదం ప్రకారం, అశ్విన్స్ యొక్క పురాతన నివాసం గంగ మీద ఉండటంవలన అప్పుడు వారు భీష్ముని తల్లి మరియు సత్యబతి తల్లివలె గాంగేయులు లేదా మత్స్యులు కావచ్చు.
5. నకులుడు మరియు సహదేవుడి జననం
నకులుడు మరియు సహదేవుడు, అప్పుడు, భీష్మునిలో ఉన్న వారిలోను అదే రక్తం ఉన్నది! ఋగ్వేద శ్లోకంలో చెప్పినట్లుగా వారు పురువంశి రుషి కుమారులు కావచ్చు, గంగతో అశ్విన్స్ సంబంధం ఉన్నట్లుగా మరియు గంగ, భరద్వాజ, దివోదస ఋషులతో s సంబంధం కలిగినట్లు. ద్రౌపది ఒకసారి 'నల్లటి ఛాయతో ఉన్నవాడిగా (శ్యామ-కళేబర)' నకులుడిని వర్ణించింది. కాబట్టి, అతని తండ్రి 'భూమి-పుత్ర' ఋషి కావచ్చు. శరీర ఛాయ కారణంగా, వారి తండ్రి వశిష్ఠమహాముని అయిఉంటాడా!
అర్జున్ - కళంకం లేని కీర్తి మరియు వెండి వంటి తెల్లటి కాంతి (సిల్వర్)
ఫాల్గుణ - ఫాల్గుణ నక్షాత్రాన జన్మించినవాడు
జిష్ణు - శత్రువులను జయించినవాడు
కిరీటి - ఇంద్రుడు సమర్పించిన ఖగోళ కిరీటము ధరించినవాడు, కిరీటి
శ్వేతవాహన - వైట్ గుర్రాలు అమర్చబడిన రథం నడిపేవాడు
పంచపాండవులు: ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రా...!?
6. పాండురాజు అతని భార్యలతో సహా ఏ స్త్రీతోనైనా లైంగిక సంబంధాలు కలిగి ఉన్న ఆ క్షణమే అతను మరణిస్తాడని ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఈ శాపం ఎందుకిచ్చాడంటే, ఆ ముని, అతని భార్యతో సంభోగంలో ఉండగా, వారిని చూసి జింక అని భ్రమించి పాండురాజు బాణం వదిలాడు. ఆ బాణం తగిలి ముని, అతని భార్య మరణించారు. అప్పుడు పాండురాజుకు ఆ ముని ఆ విధంగా శాపం ఇచ్చాడు.
పంచపాండవులు: ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రా...!?
7. మరణిస్తున్న ఋషి, ఈ దుశ్చర్య ఒక రాజుకు తగదని మరియు రాజుగా పాండురాజు సరిపోడని నిందించాడు. ఋషి చెప్పిన ప్రకారం, మానవాళిలో యెంత చెడ్డవాడైనా జంటగా ఉన్న జంతువులను హత్య చేయకూడదని అన్నాడు. పాండురాజు ఏ కారణం లేకుండా అతనిని హత్య చేశాడు. అప్పుడు ఆ ఋషి, పాండురాజు తన భార్యతోకాని, మరే ఇతర స్త్రీతోనైనా సంభోగించినప్పుడు వెంటనే మరణిస్తాడని శాపం ఇచ్చాడు.
పాండవులు, జూదంలో ఓడినతరువాట, వారి రాజ్యాలు కోల్పోయారు మరియు వారి భార్యను నిండుసభలో ఆమె వలువలు ఊడదీసి అవమానించారు . వనవాస సమయంలో వారు సంవత్సరంపాటు వారి ఉనికి కూడా ఎవరికి తెలీకుండా అజ్ఞాతంగా ఉండాలని మరియు వారి ఉనికి బయటపడితే, మళ్లీ వారు 13 సంవత్సరాల వనవాసం చేయవలసి ఉంటుంది.