Just In
- 3 hrs ago హనుమంతుడి ఫోటో ఉంటే విజయం మీదే. ఆ ఫోటో మీ ఇంట్లో ఇక్కడ ఉంటే మీ కథ క్లోజ్
- 4 hrs ago హనుమజయంతి సందర్భంగా ఈ రాశులు వారంటే హనుమంతుడికి చాలా ఇష్టం
- 6 hrs ago మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- 7 hrs ago పెరుగులో ఇవి కలిపి తింటే మలబద్దకం, డీహైడ్రేషన్ నుండి ఉపశమనం..ఇంకా ఎన్నో లాభాలు కూడా.
సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజిస్తే సంతానం కలుగుతుందా..?
గోవు సకల దేవతా స్వరూపం ... సమస్త దేవతలంతా గోవులోనే కొలువై వుంటారు. ఈ కారణంగానే గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు.
భారతీయులు ఆవును గోమాత అని అపిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి దినచర్యను ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావిస్తుంటారు. శ్రీ క్రుష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవరించడానికి పురాలణాలు కూడా చెబుతున్నాయి.
గోవు సకల దేవతా స్వరూపం ... సమస్త దేవతలంతా గోవులోనే కొలువై వుంటారు. ఈ కారణంగానే గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తరువాత ... కన్నతల్లి తరువాత ... గో 'మాత' అని పిలిపించుకునే ఏకైన జీవి ఒక్క ఆవు మాత్రమే.
భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవతగా గోమాతను పూజిస్తున్నారు.
ప్రాచీనా పవిత్ర భారతీయ సంస్క్రుతి సంపందలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవతగా గోమాతను పూజిస్తున్నారు. మానవ జాతికి ఆవు కన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎప్పుడూ ఎవరిచేతా దొంగిలించబడరాదని, దుష్టుల వాతపడకూడదని , అధిక సంతతి పొందాలనీ, యజుర్వేదంలో శుభకాంక్ష వ్యక్తం చేయబడింది.
యజ్ఞ యాగాదులలో
యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలువృద్ధి పొందగలవనీ ప్రశంసించబడింది.
పరమశివుడికి అభిషేకం చేయడం
పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకూ గోవుపాలు శ్రేష్ఠమైనవిగా, విశిష్టమైనవి.
పంచ గవ్యములు
గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి , మూత్రం , పేడ(గోమయం) మొదలగు వాటిని పంచ గవ్యములు అంటారు. ఆవు తన జీవిత కాలంలో 410400 మందికి ఒక పూట భోజనాన్ని ఇస్తుందట.
33కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.
అలాంటి గోవుకి అన్నంపెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. గోవునకు ఆహారం సమర్పించినట్లైతే 33కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.
వివాహమైన తరువాత
వివాహమైన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు. సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలతచెందుతారు.
భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు
భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు ... వ్రతాలు చేస్తుంటారు. తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు.
ఇలా సంతానం కోసం తపించేవాళ్లు ...
ఇలా సంతానం కోసం తపించేవాళ్లు ... ప్రతి రోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతోంది. గోమాతకు అన్నం పెట్టడం వలన 'సంతాన భాగ్యం' కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు.
ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని,
ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతికాలంలోనే తీరుతుందని ప్రశస్థి.