Just In
- 52 min ago ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- 2 hrs ago మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- 2 hrs ago మేషరాశిలో శుక్రుని సంచారం 12 రాశుల్లో శుక్రదశ ఎవరికి ఉంది, ఎవరికి లేదు..కోటీశ్వరులయ్యే ఛాన్స్ మీకే అయ్యుండచ్చు
- 3 hrs ago పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
వేసవిలో చర్మాన్ని కాపాడే చల్ల..చల్లని పదార్థాలు
చందనం: గంధం పొడిని పాలతో కలిపి వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అదే జిడ్డు చర్మతత్వం ఉన్న వాళ్ళు గులాబీనీటిలో కలిపి వాడుకోవచ్చు. గంధం నూనెను రెండు చుక్కలు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం పరిమిళ భరితం అవుతుంది.
తాటి ముంజలు: ఈ కాలంలో విరివిగా లభించే వీటివల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. దాహార్తిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు..అందానికీ ఎంతో మేలుచేస్తాయివి. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించడానికి తాటిముంజల్లోని నీరు దివ్వౌషధంలా పనిచేస్తాయి. వీటిని తరచూ తినడమే కాదు పూత రూపంలోనూ వేసుకోవచ్చే లేత తాటిముంజుల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
పుచ్చకాయ: దీన్ని ప్రతి రోజూ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి శరీరంలోని మిలినాల్నీ వెలుపలికి వచ్చేస్తాయి. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేకెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. అలాగే పుచ్చకాయ పలుచని ముక్కల్లా కోసి ముఖంపై అద్ది కొద్దిగా వేడిగా ఉన్న వస్త్రాన్ని కప్పి ఉంచాలి. రెండు నిమిషాలయ్యాక తీసేస్తే చర్మం సహజ కాంతిని సంతరించుకుంటుంది.
కీరదోస: దీన్ని ప్రతి రోజూ తింటే శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. సల్ఫర్, పొటాసియం, బాకంప్లెక్స్ విటమిన్లు ఇందులో పుష్కలం. కీరతో కళ్లనే కాదు చర్మాన్నీ మెరిపంచవచ్చు. కీరదోసను తురిమి ముఖానికి అద్దినట్లు చేయాలి. మపదినిషాలయ్యాక తీసేయాలి. దీని వల్ల మరింత మేలు జరగాలంటే కొద్దిగా తేనె కూడా కలిపి పూతలా వేసుకోవచ్చు. కీరదోస రసాన్ని సున్ని పిండిలో కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం అందంగా తయారవుతుంది.
కొబ్బరి బోండం: చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం ఈ నీటి సొంతం. ఈ కాలంలో ప్రతిరోజూ కొబ్బరినీటిలో ముంచిన దూదిని ముఖానికి రాసుకోవచ్చు. ఈ తర్వాత రెండు రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా మర్తన చేస్తే నల్లగా మారిన చక్మం నిగారింపును సంతరించుకుని అందంగా తయారవుతుంది. అలాగే ముదురిన కొబ్బరి నుంచి తీసిన పాలతో చర్మాన్ని మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే, చర్మం చాలా సున్నితంగా, కోమలంగా తయారవుతుంది.
సబ్జా గింజలు: శరీరానికి చల్లదనం అందించే ఈ గింజల వల్ల కలిగే మేలు అంతాఇంతా కాదు. కానీ చాలామందికి వీటినెలా ఉపయోగించాలో తెలియదు. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల గింజల్ని వేసి నానబెట్టాలి. నాలుగైదు గంటలకు అవి నాని మెత్తగా మారి ఉబ్బుతాయి. ఆ గింజల్ని మరో గ్లాసు నీటిలో వేసుకుని కొద్దిగా పంచదార లేదా తేనె కలిపి తాగితే శరీరానికి ఎంతో చలువ. అలాగే ఈ గింజల్ని తేనెతో కలపి గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. పదినిమిషాలై కొద్దిగా ఆరినట్లు అయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది. చర్మం అందంగా తయారవుతుంది.