Just In
అమెజాన్ ఫాషన్ వీక్ రెండవరోజున చూపరుల మతి పోగొట్టిన బిపాషా
అమెజాన్ ఇండియా ఫాషన్ వీక్ లో రెండవ రోజున బిపాషా బసు , పగడపు రంగు లెహంగా ధరించి రాంప్ మీద చూపించిన హొయలు ఒక మేజిక్ లా చూపరుల దృష్టిని ఆకర్షించిoది. డిజైనర్స్ కరిష్మా – దీపాసోండి రూపొందించిన ఈ విలక్షణమైన లెహంగా ను ధరించిన మాజీ మోడల్ బిపాషా బసు కార్యక్రమానికే కొత్త వెలుగులను తీసుకొచ్చింది.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ యువ డిజైనర్స్ రూపొంచిన రాష్భారీ దుస్తుల కలెక్షన్ అత్యద్భుతంగా తోచాయని కితాబిచ్చారు. ఇవి ఆధునిక భారతీయ మహిళలకోసం అతి సుందరంగా హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన కలక్షన్లుగా అభివర్ణించారు. మరియు తనకు ఇష్టమైన రంగు పగడపు రంగు అని, ఆ రంగు దుస్తులనే తనకు ఎంపిక చెయ్యడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
తన జీవితాన్ని ఒక మోడల్ గా ప్రారంభించిన బిపాషా, ఇంత ఉన్నతమైన స్థితికి రావడానికి ఎంతో అంకితభావంతో శ్రమించానని, ఈరోజున ఆ పాత జ్ఞాపకాలన్నీ తనకు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు.
"మేము మోడలింగ్ మొదలు పెట్టిన రోజుల్లో, ఫ్యాషన్ రంగo అప్పుడప్పుడే మెరుగులు దిద్దుకుంటూ ఉంది , కానీ ఇప్పుడు ఆ పరిస్తితి దాటిపోయి, చాలా తీవ్రమైన మరియు సవాలైన వృత్తిగా ఉంది. మీరు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి ఉత్తమంగా కనిపించేలా పాటుపడాలి. శరీరానికి సరిపోయే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎప్పుడూ ఫిట్నెస్ లెవల్స్ సరిగా చూసుకుంటూ, చర్మాన్ని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని మోడల్స్ కు సూచనలు చేసింది బిపాషా బసు.