Just In
- 1 hr ago ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
- 5 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 6 hrs ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 16 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
మీ దైనందిన ఆహారంలో పెరుగును చేర్చడం వలన కలిగే ప్రయోజనాలు
మీ దైనందిన ఆహారంలో పెరుగును చేర్చడం వలన కలిగే ప్రయోజనాలు
చాలా కాలంగా పెరుగును భారతీయులు తమ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలే కారణం. ప్రతిరోజూ లేదా తరచుగా మనం పెరుగును అన్నంతో కలిపి తినడం వలన మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయటమే కాక మీ సంపూర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పెరుగన్నం దక్షిణ భారతదేశంలో పుట్టినప్పటికి అది కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమవ్వలేదు. ఉత్తర భారతంలో కూడా ఇది చాలా ప్రఖ్యాతిగాంచింది, ముఖ్యంగా వేసవిలో. కడుపులో గడబిడగా ఉన్నవారు సాధారణంగా పెరుగన్నం తింటారు.
ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు పెరుగన్నం: పెరుగన్నం మన వంటింట్లో సులువుగా తయారు చేయవచ్చు. దీనివలన పలు ప్రయోజనాలు ఉన్నాయి.
1. కడుపుబ్బరంను నివారిస్తుంది కనుక అజీర్తి, కడుపులో మంట మొదలైన సమస్యలు ఉన్నప్పుడు పెరుగన్నం తినడమే ఉత్తమమైన గృహవైద్యం. పెరుగన్నం జీర్ణకారిగా పేరుగాంచింది.
2. పెరుగన్నాన్ని చల్లగానే తినడం ఉత్తమం. ఇది దేహాన్ని చల్లబరచి సరైన శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఉండేటట్లు చేస్తుంది. కనుక జ్వరాలు ఉన్నప్పుడు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పెరుగన్నం తింటే శరీరాన్ని త్వరగా వేడెక్కనివ్వదు.
3. పెరుగులో యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ మరియు మంచి కొవ్వులు ఉంటాయి. కనుక పెరుగు తినడం వలన ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది మెదడుకు బాధలు, నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది.
4. బరువు కోల్పోవాలనుకునేవారు కనీసం రోజులో ఒక్కపూటైనా పెరుగన్నం తినాలనుకుంటారు. ఒక గిన్నెడు పెరుగన్నం తింటే కడుపు నిండిన భావన కలిగి అధిక కెలోరీలు ఉండే చిరుతిళ్ళను తినరు. ఫ్రైడ్ రైస్ తో పోలిస్తే పెరుగన్నంలో చాలా తక్కువ కెలోరీలు ఉంటాయి.
5. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక అనారోగ్యంతో బాధపడుతున్నపుడు పెరుగన్నం తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అనారోగ్య సమయంలో శరీరానికి అవసరమైన శక్తిని పంపిణీ చేస్తుంది.
ఇవే కాకుండా పెరుగన్నం తినడం మంచిదని చెప్పడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఇది పసి పిల్లలు కూడా తినవచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండటంతో శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది.
కారంగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తరువాత పెరుగన్నం తింటే కడుపు మండటం, చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. కనుక ఏవైనా వేపుళ్ళు లేదా కారంతో కూడిన వంటలు తిన్నాక పెరుగన్నం తినడం మంచిది. పెరుగు చర్మాన్ని కూడా కాంతివంతంగా మారుస్తుందని పేరు పొందింది. కనుక దీన్ని ఫేస్ ప్యాకులలో కూడా ఉపయోగించవచ్చు.
పెరుగన్నాన్ని తయారు చేయడం ఎలా?
పెరుగన్నాన్ని తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో అన్నాన్ని, పెరుగుని కలిపండి. ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేసి అందులో జీలకర్ర, మినప్పప్పు మరియు కరివేపాకు వేసి చితపటలాడనివ్వండి. దీనిని అన్నం పెరుగుల మిశ్రమంలో బాగా కలపండి. దీనిని వెంటనే తినేయవచ్చు. దీనిని ఎంతో సులువుగా చేసుకోగలిగినందున, మీరు ఒంటరిగా జ్వరంతో బాధపడుతున్నా కూడా దీనిని చేసుకోవచ్చు.
దీనిని క్షణాల్లో తయారు చేయవచ్చు కనుక, మీరు అలసిపోతారు. పెరుగన్నంలోపచ్చిమిర్చి, ఆవాలు, ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పు కూడా వేస్తే రుచి ఇంకా రుచి పెరుగుతుంది. దానిమ్మ గింజలు,క్యారెట్, ద్రాక్ష పండ్లు మరియు తురిమిన పచ్చి మామిడి పండ్ల ముక్కలు కూడా పెరుగన్నానికి కలిపితే పోషక విలువలు పెరుగుతాయి.
డయేరియాతో బాధపడుతున్న వారు పెరుగన్నం తినడం శ్రేయస్కరం. కొన్ని మెంతులతో కలిపి తింటే కడుపునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
మెనోపాస్ సమీపిస్తున్న స్త్రీలను కూడా పెరుగన్నం తినమని వైద్యులు సూచిస్తారు. దీని వలన శరీరానికి కాల్షియం సరఫరా పెరుగుతుంది.
పాలతో పోలిస్తే పెరుగు మంచి ఎంపిక. అదికూడా పెరుగన్నం రూపంలో అయితే ఇంకా మంచిది. పాలు తాగితే కడుపు భారంగా అనిపించవచ్చు కానీ పెరుగన్నం తినప్పుడు అలా అనిపించదు. అధ్యయనాల ప్రకారం పెరుగులో ఉండే ప్రోటీన్ పాలలో ఉండే ప్రోటీన్ తో పోలిస్తే త్వరగా అరుగుతుంది. పొటాషియం ఉండటం వల్ల పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. జాండీస్ నివారణకు పెరుగును తేనెతో కలిపి తీసుకుంటారు.
పెరుగు శరీరానికి చల్లదనం చేకూర్చే పోషకాహారం కనుక ప్రతి ఒక్కరు తమ డైట్ ప్లాన్ లో చేర్చుకోవాలి. పెరుగును అన్నంతో పాటుగా తింటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతమవుతుంది.