Just In
ఉప్పుతో మైగ్రేన్ నుంచి క్షణాల్లో ఉపశమనం పొందడం ఎలా ?
మైగ్రేన్ తో బాధపడేవాళ్లు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది మైగ్రేన్ తగ్గాలంటే.. కాస్ట్ లీ మందులు వాడక తప్పదని, చాలా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిందే అని భయపడతారు. కానీ.. సింపుల్ గా సెకన్ లో మైగ్రేన్ నుంచి బయటపడవచ్చట.
పార్శ్వతలనొప్పి నివారణకు సహాయపడే 8 యోగాసనాలు
మైగ్రేన్ వచ్చిందంటే.. రోజంతా ఇబ్బంది పడాల్సిందే. ఏ పని చేయనీయకుండా తలనొప్పి మనిషిని కుంగదీసేస్తుంది. కొన్నిసందర్భాల్లో కొన్ని మైగ్రేన్స్ ఎన్ని మందులు, పెయిన్ కిల్లర్స్ వాడినా ఉపశమనం కలుగదు. కానీ చాలా చీప్ గా మైగ్రేన్ నుంచి క్షణాల్లో బయటపడవచ్చు. అది సాల్ట్. ఉప్పుతో ఉప్పెనలాంటి మైగ్రేన్ నుంచి క్షణంలో రిలాక్స్ అవవచ్చు.
ఉప్పుతో మైగ్రేన్ తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నించే ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మైగ్రేన్ నివారించడానికి ఉపయోగించే ఉప్పు చాలా క్వాలిటీది అయి ఉండాలి. హిమాలయ క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి. ఇందులో మినరల్స్, ఎలక్ర్టోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని బెస్ట్ సాల్ట్ గా సైంటిస్ట్ లు నిరూపించారు. కాబట్టి దీన్ని ఉపయోగిస్తే తలనొప్పి నుంచి త్వరిత ఉపశమనం పొందవచ్చు.
మీకు మైగ్రేన్ తలనొప్పి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా...
ముందుగా ఒక నిమ్మకాయ తీసుకుని రసం అంతా ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దానిలోకి ఒక టీ స్పూన్ హిమాలయ క్రిస్టల్ సాల్ట్ కలిపి.. తాగాలి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఇంత మొత్తంలో తాగడం ఇష్టం లేకపోతే.. అర నిమ్మకాయ రసం తీసుకుని, అర టీ స్పూన్ సాల్ట్ కలిపి తీసుకున్నా మైగ్రేన్ నుంచి రిలాక్స్ అవడం సాధ్యమవుతుంది.