Just In
- 41 min ago హనుమాన్ జయంతి రోజు ఇలా చేస్తే.. శనిదోషం తొలగిపోతుంది
- 2 hrs ago లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- 3 hrs ago ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
- 7 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
‘జామే’ కదా అని చిన్న చూపు చూడకండి..!!
జామ ఫలాలు తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న కండను కలిగి ఉండటమ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆరెంజ్ రంగు కండ కలిగిన జామ ఫలాలు కూడా లభిస్తుంటాయి. కండ భాగంలోని గింజలను పరిశీలిస్తే చిన్నవైనా ధృడంగ ఉంటాయి. తెల్ల గుజ్జు జామ పండులో కంటే ఎరుపు, ఆరెంజి రంగు గజ్జు కలిగి ఉన్న జామ పళ్లలో బీటాకారోటిన్, పాలిఫినాల్స్, కెరటి నాయిడ్స్ వంటి ఫోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రోజు 3 జామాకులను నమిలితే దంతక్షయం పోతుంది. జామాకులను నీటిలో మరగించి ఆ మిశ్రమాన్ని సేవిస్తే దగ్గు, జలుబు ఇట్టే మటుమాయమవుతాయి. పండిన జామపండును రోజు ఆహారంలా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా డైటింగ్ చేసేవారికి జామ పండు బలవర్థక ఆహారం.
వృక్షశాస్త్ర వర్గీకరణలో 'మిర్టేసి' కుటుంబానికి చెందిన జామను 'సీడీఎమ్ గావా'గా పిలుస్తారు. ఏ మాత్రం అవకాశమున్న జామచెట్లను మీ పెరటిలో పెంచి ఇంటిల్లిపాది ఆరోగ్యవంతంగా ఉండండి.