Just In
- 1 hr ago Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- 2 hrs ago మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- 3 hrs ago సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- 6 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
మైదాపిండి గురించి బయటపడిన రహస్యాలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి !
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం నెమ్మది నెమ్మదిగా మనల్ని చంపేస్తుందని మీకు తెలుసా? తెల్లగా కనబడుతున్న ఆహారపదార్థాలను, మానవుని ఆహారంగా పరిగణించకూడదని మీకు తెలుసా ?
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం నెమ్మది నెమ్మదిగా మనల్ని చంపేస్తుందని మీకు తెలుసా? తెల్లగా కనబడుతున్న ఆహారపదార్థాలను, మానవుని ఆహారంగా పరిగణించకూడదని మీకు తెలుసా ?
అవును, ఎందుకంటే ఈ రోజుల్లో గోధుమలతో పిండిని తయారు చేస్తున్నారు, కానీ గోధుముల తయారీలో విత్తనాల దశ నుండి - నిల్వ చేసే దశ వరకు చాలా రకాల క్రిమినాశకాలను, పురుగుల మందులను, ఫంగస్ను నియంత్రించే అనేక రకాల మందులను ఉపయోగిస్తారు.
ఆ విధంగా తయారైన మైదాపిండి చాలా రకాల దుష్ప్రభావాలను మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇందులో సాధారణంగా బాగా శుద్ధి చేయబడిన కారణం చేత, కార్బోహైడ్రేట్లను అధిక స్థాయిలో కలిగి ఉండి, చాలా తక్కువ మోతాదులో పోషకాలను కలిగి ఉంటుంది.
మైదాపిండి అనేది నిజానికి గోధుమపిండి ప్రతిరూపమైన, గోధుమలో రెండు ప్రధాన కారకాలుగా ఉన్న తవుడును మరియు బీజమును తొలగించడం ద్వారా ఇది తయారు కాబడుతుంది.
సాధారణంగా ధాన్యాలలో ఫైబర్తో కూడిన తవుడు అనేది అధిక మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా, మైదాపిండిలో కలపబడిన ఫోలిక్ ఆమ్లం అనేది స్త్రీల యొక్క రొమ్ముపైన తీవ్రమైన స్థాయిలో హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలో వెల్లడైంది.
ఈ
వ్యాసంలో,
మైదాపిండి
ఎందుకు
మీ
ఆరోగ్యానికి
హానికరమైనదనే
విషయం
గురించి
తెలియజేస్తున్నాము,
వాటి
గూర్చి
మీరు
చదివి
తెలుసుకోండి
!
1. మైదాపిండిలో పోషకాలు లేవు :
ఈ పిండి తయారీ సమయంలో మొట్టమొదటిగా తవుడును తొలగించబడుతుంది. ఆ తర్వాత,76% విటమిన్లు మరియు ఖనిజాలు కలిగి ఉన్న బీజమును తొలగిస్తారు. అంతేకాకుండా, 97% ఆహారంలో ఉన్న పీచును, 50% కాల్షియంను మరియు 70% భాస్వరాన్ని కూడా శుద్ధి చేసే ప్రక్రియలో తొలగించబడతాయి.
2. పొటాషియం బ్రోమేట్ను అదనంగా జోడిస్తారు :
మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్గా చెప్పబడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో, ఈ బ్రోమేట్ను 2B-క్యాన్సర్కు కారకమని భావించి, దానిపై నిషేధం విధించారు.
3. ఇది సహజంగానే కీటక వినాశిని :
మైదా పిండిని తినడానికి ఏవైనా కీటకాలని ప్రయత్నిస్తే, అవి తక్షణమే మరణిస్తాయి. ఎందుకంటే మైదాపిండి అనేది సహజమైన క్రిమి-సంహారకారిగా ఉంటూ, తినే కీటకాలను వెంటనే చంపుతుంది.
4. ఇది L-సిస్టైన్ను కలిగి ఉంటుంది :
ఈ రకమైన ఆవశ్యకం-లేని అమైనో ఆమ్లమును, పిజ్జా, కుకీస్, పాస్తాలు మరియు ఫాస్ట్ ఫుడ్స్ లో కాల్చబడిన రొట్టెలలో ఉపయోగిస్తుంటారు. L-సిస్టైన్ యొక్క కృత్రిమ తయారీ అనేది, బాతు (లేదా) కోడి ఈకల నుండి, మనిషి జుట్టు నుండి, ఆవుల కొమ్ముల నుండి, పెట్రోలియం యొక్క ఉప ఉత్పత్తుల నుండి చవకైన రీతిలో ఉత్పాదన మార్గాన్ని కలిగి ఉన్నారు.
5. డయాబెటిస్ను కలుగజేసే కలుషితాలు ఇందులో ఉన్నాయి :
మానవ శరీరానికి హానికరమైన ప్రభావాలను కలగజేసే అల్లాక్సాన్ (alloxan) అనే కారకాన్ని ఇది కలిగి ఉంది. క్లోమము యొక్క బీటా-కణాలను ఇది నాశనం చేస్తుంది మరియు శరీరాన్ని విషపూరితంగా మారుస్తుంది. అందువల్ల దీనిని "మధుమేహకారక కలుషితమని" కూడా అంటారు.