Just In
- 1 hr ago
Today Rasi Phalalu :ఈ రోజు కొన్ని రాశుల వారికి అదృష్టం మరియు కోరికలు నెరవేరే సమయం
- 13 hrs ago
ఎంత నీళ్ళు తాగినా మరుసటి నిమిషంలో దాహం వేస్తుందా? అప్పుడు మీకు ఈ వ్యాధి రావచ్చు...!
- 15 hrs ago
మీ భర్త లేదా భార్య కోపంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ మాట అనకండి!
- 17 hrs ago
దోసకాయను తొక్కతో ఎందుకు తినకూడదు?... అలా తింటే ఏమవుతుంది?...
Don't Miss
- News
ఉదయ్పూర్ కన్నయ్యలాల్ హత్య: హైదరాబాద్ పాతబస్తీలో మరో నిందితుడి అరెస్ట్, ఎన్ఐఏ దర్యాప్తు
- Sports
Sanjay Manjrekar: రిషబ్ పంత్ మునుపటిలా అరవట్లేదు.. కాస్త సీరియస్గా కీపింగ్ చేస్తున్నాడు
- Finance
RBI's decision on currency notes: కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
- Movies
Aamir Khan మూవీ రైట్స్ అల్లు అరవింద్ చేతికి.. నాగచైతన్య కోసం ఎంత చెల్లించారంటే?
- Technology
2023 లో SmartPhones ధరలు మరింత ప్రియం కానున్నాయా!
- Travel
మన తెలంగాణలోనూ ఓ నయాగర జలపాతం ఉందండోయ్!
- Automobiles
ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా "విటారా" హైబ్రిడ్ ఎస్యూవీ, జులై 20న లాంచ్!
Republic Day 2022:చరిత్ర తిరగరాసిన నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేసిన ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
జనవరి 26వ తేదీ అంటే గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు జరుపుకునే రోజు అని మనందరికీ తెలుసు. ఇదే ప్రత్యేకమైన విషయం అంటే.. అంతకంటే ప్రత్యేకంగా ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఈరోజును మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు మన మహిళా పైలట్లు, జవాన్లు.
చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత వైమానిక దళం(IAF)లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్ కు నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన వారిలో తొలి మహిళా పైలట్ గా స్వాతి రాథోడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇది మహిళలందరికీ స్ఫూర్తినివ్వడమే కాదు.. వారి సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా గుర్తించినట్లు అవుతుంది. స్వాతి రాథోడ్ ఈ స్థాయికి చేరడానికి తన తండ్రి చేయించిన సాధన.. ఆ సాధనతోనే తాను ఎంతగానో ప్రేరణ పొందినట్లు స్వాతి చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్వాతి రాథోడ్ తండ్రి మాట్లాడుతూ 'నా కుమార్తె ఈరోజు నన్ను తల ఎత్తుకునేలా చేసింది. తను కన్న కలలు సాకారం కావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో నేను ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. నాకు మాటలు రావడం లేదు, నాకు చాలా గర్వంగా ఉందని' స్వాతి తండ్రి భావ్నాని సింగ్ రాథోడ్ అన్నారు.
స్వాతి గురించి చెబుతూ.. తను రాజస్థాన్ రాష్ట్రంలోని నాగ్ పూర్ జిల్లాలో జన్మించిందని.. రాజస్థాన్ లోని అజ్మీర్ పాఠశాలలో తన విద్యను పూర్తి చేసినట్లు తెలిపారు. తన చిన్నతనం నుండే గొప్ప దేశభక్తురాలు. అప్పట్లో పాఠశాలలో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో, ఆమె జాతీయ జెండాను గీసి, భారతదేశంపై ఉన్న తన ప్రేమను చాటుకుందని గుర్తు చేశారు.
స్వాతి రాథోడ్ సాధించిన ఈ ఘనతను చూసి మేము చాలా గర్వపడుతున్నాం. స్వాతి సాధించిన ఈ విజయం వల్ల దేశంలోని ఇతర మహిళలకు సాధికారత సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని తాము ఆశిస్తున్నామని స్వాతి పేరేంట్స్ చెప్పారు.
చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత వైమానిక దళం(IAF)లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్ కు నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన వారిలో తొలి మహిళా పైలట్ గా స్వాతి రాథోడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇది మహిళలందరికీ స్ఫూర్తినివ్వడమే కాదు.. వారి సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా గుర్తించినట్లు అవుతుంది. స్వాతి రాథోడ్ ఈ స్థాయికి చేరడానికి తన తండ్రి చేయించిన సాధన.. ఆ సాధనతోనే తాను ఎంతగానో ప్రేరణ పొందినట్లు స్వాతి చెబుతున్నారు.