Just In
- 4 hrs ago మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- 6 hrs ago మీ శరీరంలోని ఈ భాగాలలో తరచుగా నొప్పిని అనుభవిస్తున్నారా? అయితే ఈ అవయం డేంజర్లో పడిందని అర్థం.జాగ్రత్త
- 9 hrs ago షాకింగ్ ఘటన: సోలో సెక్స్ లైంగిక ఆనందం కోసం పురుషాంగానికి 11 ఉంగరాలు పెట్టుకున్న వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు!
- 9 hrs ago వీధి వీధిలో నోట్లు దొరుకుతున్నాయి.!దొరికినోడికి దొరికినంత..!మీరు దోచుకోవాలంటే అక్కడికి వెళ్ళాల్సిందే
Happy Guru Purnima 2022 Wishes:గురు పూర్ణిమ విషెస్ ను మిత్రులకు, బంధువులతో షేర్ చేసుకోండిలా...
మీ గురువులకు గురుపూర్ణిమ విషెస్ ను షేర్ చేయండిలా..
భారతీయుల సంప్రదాయాలలో గురువుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం, గురు పూర్ణిమను ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలోని శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
ఈరోజు గురువులకు అంకితం చేయబడింది. వ్యాస మహర్షి ఈ పవిత్రమైన రోజునే పుట్టాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈరోజున గురువు ఆరాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు.
తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమని.. గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ణానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు.
ప్రతి ఒక్క గురువు తమ శిష్యులకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతాడు. అంతేకాదు విద్యార్థులు విజయం సాధిస్తే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం అనేది శిష్యుల కర్తవ్యం. శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే వ్యాసుడి పేరు క్రిష్ణద్వైపాయనుడు. పూర్ణిమ రోజున వ్యాస భగవానుడిని, గురువు పూజించడం అనేది విధిగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఈ సందర్భంగా గురు పూర్ణిమ రోజున మీ గురువులకు, మిత్రులకు, కుటుంబసభ్యులకు ఇలా విషెస్ చెప్పండి.
Guru Purnima 2021: గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
గురువుకే తొలి ప్రాధాన్యత..
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్తు పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
విష్ణు సహస్ర నామాల్లో
‘వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే..
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ
నమో నమః' అంటూ విష్ణు సహస్ర నామాల్లో
వ్యాస మహర్షిని స్తుతించారు.
గురువును మించిన తత్వం
‘న గురోరధికం తత్వం న గురోరధికం తపః
తత్త్వజ్ణానత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః'
అంటే గురువును మించిన తత్వం, తపస్సు,
జ్ణానం వేరొకటి లేవు అని అర్థం.
అఖండ మండలా కారం
‘అఖండ మండలా కారం వ్యాప్తం
యేవ చరాచరమ్ తత్పదం దర్శితం
యేన తస్మై శ్రీ గురవే నమః'
అంటే ఈ భూమండలమంతా సంపూర్ణంగా వ్యాపించి ఉన్న భగవంతుడిని ఏ పదం దర్శింప జేస్తుందో అలాంటి తత్వాన్ని
బోధించే గురువులందరికీ శతకోటి వందనాలు
పరబ్రహ్మ స్వరూపులే!
భావి తరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే!
ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల గుండెలలో కొలువైఉన్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన గొప్ప గురువు.