Just In
- 32 min ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 1 hr ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 1 hr ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
- 2 hrs ago టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
భారతదేశ గొప్ప తత్త్వవేత్త, ఆర్థికవేత్త అయిన చాణక్య మరణం వెనుక వీడని రహస్యాలెన్నో...
భారతదేశ గొప్ప తత్త్వవేత్త అయిన చాణక్యను మోసం చేసి ఎలా చంపారో ఇప్పుడు తెలుసుకుందాం.!
మన భారతదేశంలో పూర్వకాలం నుండి నేటి వరకు తత్తవేత్త, ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుని విధానాలు.. వ్యూహాలు ఇప్పటికీ చాలా మంది అనుసరిస్తారు. గొప్ప ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. మౌర్య సామ్రాజ్యంలోని ఆర్థిక శాస్త్రం నేటికీ మనుగడలో ఉందంటే ఆయన ఎంతటి గొప్ప మేధావో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే అతని గురించి కొన్ని విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఆచార్య చాణక్య క్రీస్తుపూర్వం 200 శతాబ్దంలో జన్మించాడని తెలుస్తోంది. అయితే తన మరణం ఎప్పుడు జరిగిందో.. ఎలా జరిగిందో అనే విషయాలు ఎవ్వరికీ సరిగ్గా తెలియదు. పట్టుదలకు.. పౌరుషాలకు, అద్భుతమైన మేధస్సుకు నిదర్శనం చాణక్యుడు. అలాంటి మేధావి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య గావింపబడ్డాడా? లేక సహజ మరణమేనా అనే విషయాల పట్ల ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన మరణం చుట్టూ ఎన్నో కథలు వెలుగులోకొచ్చినప్పటికీ, తన మరణం మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఎన్నో కథలు..
చాణక్య మరణం గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, క్రీస్తు పూర్వం 275లో తన జీవితం ముగిసిపోయిందని చాలా మంది భావిస్తున్నారు. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవు.
కొంచెం విషాన్ని
బిందుసార తండ్రి చంద్రగుప్త సింహాసనంపై ఉన్నప్పుడు, రాజు తన శత్రువులచే ప్రమాదానికి గురి కాకుండా, చాణక్య ప్రతిరోజూ తన ఆహారంలో కొంచెం విషాన్ని చేర్చేవాడు. తన శత్రువులు పెట్టిన విషం తీసుకున్నప్పటికీ రాజు యొక్క రోగి నిరోధక శక్తి అతనిని రక్షిస్తుందనే నమ్మకం ఆయనకు ఉండేదట. ఈ విషయం తెలియక రాణి గర్భవతిగా ఉన్న సమయంలో చంద్ర గుప్తకు కేటాయించిన ఆహారాన్ని తీసుకుంది.
శిశువును బయటకు
ఒకరోజు రాణి గర్భవతిగా ఉన్న సమయంలో చక్రవర్తికి తెలియకుండా ఆ ఆహారాన్ని తీసుకుంది. విషపూరితమైన ఆహారం తినడం ఆమెకు అలవాటు కానందున, ఆమె మరణించింది. అలాంటి సమయంలో శిశువు చనిపోకూడదని నిర్ణయించుకున్నాడు. అందువల్ల అతను రాణి కడుపు తెరిచి శిశువును బయటకు తీశాడు. ఒక చుక్క విషం శిశువు తలమీదకు వెళ్లింది. అందుకే చాణక్య అతనికి బిందుసార అని పేరు పెట్టారు.
స్వచ్ఛంద ఆకలితో
బిందుసార పెరిగి పెద్దయి, యువకుడిగా మారినప్పుడు చంద్రగుప్త సింహాసనాన్ని వదులుకుని, జైన సాధువు భద్రబాహును నేటి కర్నాటకను అనుసరించి, శ్రావణ బెలగోల అనే ప్రదేశంలో స్థిరపడ్డారు. అతను కొన్ని కొన్ని సంవత్సరాలు సన్యాసిగా జీవించాడు. ఇక జైన సంప్రదాయం ప్రకారం స్వచ్ఛంద ఆకలితో మరణించాడు. ఇంతలో చాణక్య బిందుసార నిర్వాహకుడిగా కొనసాగారు.
రాణి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని
తన తల్లి హత్యకు చాణక్య కారణమని ఓ రోజు బిందుసారకు తెలుస్తుంది. ఇది నిజమా కాదా అని రాజు విచారించగా.. బిందుసార తల్లి దుర్దాతో కలిసి ఉన్న ఒక నర్సు, రాణి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బిందుసారాకు చెప్పి, చాణక్యను అపరాధం నుండి రక్షించింది.
అలా మరణించాడని..!
ఈ సమయంలో బిందుసార తనపై కోపంగా ఉన్నాడని తెలుసుకున్నాడని భావించిన చాణక్య తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో తన ఆస్తిని పేదలకు, అనాధలకు విరాళంగా ఇచ్చేసి, ఓ పేడకుప్పపై కూర్చుని ఆహారపానీయాలను త్యజిస్తాడు. అలా ప్రాణాలను వదిలేస్తాడు.
మరో కథనం..
అయితే వాస్తవం తెలుసుకున్న తర్వాత, బిందుసార చాణక్యకు భరోసా ఇచ్చి రాజభవనానికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, చాణక్య అందుకు నిరాకరించి, ఆకలితో మరణిస్తూనే ఉన్నాడు. మరో అభిప్రాయం ఏమిటంటే, సుబంధ చాణక్యను సజీవదహనం చేసినట్లు చెబుతారు. చాణక్య మరణం గురించి జైన రచయిత హేమచంద్ర ప్రస్తావించిన మరో కథలో, బిందుసార మంత్రులలో ఒకరైన సుబాంధు కుట్ర ఫలితంగా ఆయన మరణించారని పేర్కొంది. తన తల్లి హత్యకు చాణక్యనే కారణమని, చాణక్యుడు అంటే ఇష్టపడని సుబాంధు బిందుసారతో అన్నారు. ఈ మేరకు తాను ఎలా పుట్టాడనే విషయాన్ని నర్సులను బిందుసార అడిగారు. ఇలా రకరకాల అభిప్రాయాల వల్ల చాణక్య మరణానికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.