Just In
- 17 min ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- 3 hrs ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- 4 hrs ago పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- 4 hrs ago ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
International Women’s Day 2023: నారీ శక్తి పురస్కారాలు ఎందుకు ఇస్తారు? ఈ ఏడాది ఎవరికొచ్చాయంటే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాలను 29 మంది మహిళలకు అందజేయనున్నారు.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021 సంవత్సరాల్లో అత్యుత్తమ శక్తివంతమైన మహిళల్లో 29 మందిని ఎంపిక చేశారు.
దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు మహిళా దినోత్సవం రోజున నారీ శక్తి పురస్కారాలను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
LIVE: President Kovind presents Nari Shakti Puraskar for 2020 & 2021 on International Women's Day https://t.co/T9kQCtInR7
— President of India (@rashtrapatibhvn) March 8, 2022
వీరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంభాషించనున్నారు. ఈ అవార్డులను వివిధ రంగాల్లో మహిళల సాధికారతకు, వారి అభివృద్ధి కోసం క్రుషి చేసిన మహిళలు, ముఖ్యంగా బలహీన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల సాధికారత కోసం, వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది.
స్త్రీల దైనందిన జీవితాలను తెలిపే యానిమేటెడ్ గూగుల్ డూడుల్ ను మీరూ చూడండి...
నారీ శక్తి పురస్కారం ఎవరికి..
నారీ శక్తి పురస్కారం అనేది మహిళలు మరియు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చొరవ, వ్యక్తులు మరియు సంస్థలు అందించిన అసాధారణమైన సహకారాన్ని గుర్తించి, మహిళలను గేమ్ ఛేంజర్ గా మరియు సమాజంలో సానుకూల మార్పునకు ఉత్ప్రేరకంగా జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘నారీ శక్తి' అవార్డుకు ఎంపికైన వారికి సర్టిఫికెట్ తో పాటు లక్ష రూపాయల నగదు కూడా అందజేయనున్నారు.
ఈ అవార్డులు ఎందుకంటే..
మహిళలు తమ కలలను నెరవేర్చుకునేందుకు వయసు, భౌగోళిక అడ్డంకులు లేదా వనరుల లభ్యత ఇతర కారణాలేవో ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని అధిగమించేందుకు, వారి అచంచలమైన స్ఫూర్తి సమాజాన్ని మరియు ముఖ్యంగా యువ భారతీయ మనస్సులను లింగ మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడానికి మరియు లింగ అసమానతలను, వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి మహిళలను ప్రేరేపిస్తుంది'' అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సమాజం అభివృద్ధిలో మహిళలను సమాన భాగస్వాములుగా గుర్తించే ప్రయత్నమే ఈ అవార్డులను వివరించింది.
Women's day color 2022 :ఉమెన్స్ డే నాడు ఏ కలర్ డ్రెస్.. దేనికి సంకేతమో తెలుసా...
ఈ అవార్డులను..
నారీ శక్తి పురస్కారాలను వ్యవస్థాపకులు, వ్యవసాయం, ఆవిష్కరణలు, సామాజిక పని, విద్య మరియు సాహిత్యం, భాషా శాస్త్రం, కళలు మరియు చేతి వృత్తులు, STEMM(Science, Technology, Engeneering and Mathematics), వైకల్య హక్కులు, వ్యాపారులు, వ్యాపారవేత్తలు, వన్యప్రాణుల సంరక్షణ వంటి రంగాల వారికి ఈ అవార్డులను అందజేస్తారు.
పురస్కారాలకు ఎవరు ఎంపికయ్యారంటే..
నారీ శక్తి అవార్డు గ్రహితలలో సామాజిక వ్యవస్థాపకురాలు అనితా గుప్తా, సేంద్రీయ రైతు మరియు గిరిజన ఉద్యమకారిణి ఉషాబెన్ దినేష్ భాయ్ వాసవ, ఆవిష్కర్త నసీరా అఖ్తర్, ఇంటెట్-ఇండియా హెడ్ నివృత్తి రాయ్, డౌన్ సిండ్రోమ్ బాధిత కథక్ డ్యాన్సర్ సైలీ నంద్కిషోర్ అగవానే, తొలి మహిళా పాము రక్షకురాలు వనితా జగదీయో బియోర్ మాథమాటిక్ తో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారు.
ఈ సమాచారం మొత్తం PTI నుండి సేకరించబడింది.
- మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నిత్యం మనందరి శ్రేయస్సు కోరుకునే వారిలో మహిళలే ముందుంటారు. మనిషి మనుగడకు మూలాధారమైన మహిళను గౌరవంగా స్మరించుకునే రోజే మహిళా దినోత్సవ రోజు.