Just In
- 39 min ago సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- 3 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- 5 hrs ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 6 hrs ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
మాదక ద్రవ్యాలతో మహిళల కాన్పులు!
మత్తు ఇంజెక్షన్లు పిరుదులకు, తొడలకు ఇస్తారు. కొన్ని సార్లు ఐవి ట్యూబుద్వారా కూడా ఇస్తారు. ఎలా ఇచ్చినా నొప్పి తగ్గుతుంది. నొప్పులు వచ్చేదానికి కొద్దిపాటి ముందే ఇస్తే సరైన సమయానికి నొప్పి తెలియకుండా వుంటుంది. ఇది అసహజమైనప్పటికి, దీని వలన కొన్ని లాభాలు, నష్టాలు కూడా వున్నాయి. ప్రధానంగా నొప్పి తెలియదు. బిడ్డ బయటకు వచ్చే ప్రక్రియలో వీటి ప్రభావం వుండదు. అంతేకాదు ఈ మత్తు మందులు మహిళలు ఆందోళన పడకుండా కూడా చేస్తాయి.
నష్టాలు పరిశీలిస్తే, వికారం, దురద, కళ్ళు తిరిగినట్లుండటం, శ్వాసలో మాంద్యం మొదలైనవి వస్తాయి. మందు పరిమాణం ఎక్కువైతే, తల్లి, పిల్ల ఇద్దరూ కూడా మత్తులోకి జారుకుంటారు. సరైన సమయంలో కనుక మత్తు ఇవ్వక పోతే, బేబీ శ్వాస, గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. బిడ్డ మరికొన్ని ఇతర సమస్యలకు కూడా గురవుతుంది.
బిడ్డ పుట్టేటపుడు సాధారణంగా డెమెరాల్, న్యూబియన్, మార్ఫిన్ స్టాడల్, ఫెంటానీ అనే మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. లాభ నష్టాల బేరీజు వేసుకుంటే, బిడ్డ సహజంగా పుడితే మహిళకు, పట్టిన బిడ్డకు ఎంతో మంచిదని చెప్పవచ్చు.