Just In
- 8 min ago ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
- 4 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 5 hrs ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 14 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చే అబార్షన్లు!
సరి అయిన అవగాహన లేక నేటి యువతులు అసుక్షిత అబార్షన్లకు గురైపోతున్నారు. ఒక ప్రాధమిక నివేదిక మేరకు 6,00,000 గర్భవతుల మరణాలలోను 13 శాతం అసురక్షిత అబార్షన్ల కారణంగానని కూడా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 మిలియన్ల అసురక్షిత అబార్షన్లు జరుగుతున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. మరో ఆశ్చర్యకర విషయంగా, ఈ అబార్షన్లు అత్యధికంగా భారతదేశంలోనే జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వైద్యపర సమస్యలున్నాయని తెలిసి కూడా గర్భవతులు తమ గర్భాలను అసురక్షిత మార్గాల ద్వారా విచ్ఛిన్నం చేసుకోటానికి ప్రయత్నించటం వారికిగల అవగాహనా లోపమే. శాస్త్రీయపరంగా కనుక అబార్షన్ చేసినట్లయితే అది ఎంతో తేలిక దానినే మెడికల్ టర్మినల్ ఆప్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. కాని సమాజానికి భయపడి చాలామంది నేడు అసుక్షిత విచ్ఛిన్న విధానాన్ని ఆచరిస్తున్నారు.
ప్రభుత్వాలు ఈ దిశగా తమ దృష్టిని కేంద్రీకరించి చట్టాలలో సవరణలు తీసుకురావలసిన భాధ్యత వారిపై వుంది. చట్టాలున్న దేశాలలో సరి అయిన అవగాహన కల్పించాల్సిన అవసరం వుంది. మనదేశంలో చాలామంది స్త్రీలు అబార్షన్లు అన్ని దశలలోను చట్టబద్ధం కానివిగానే అర్ధం చేసుకుంటున్నారు. అన్నిటికంటే కూడా ముందు సమాజం గర్భవిచ్ఛిన్నాలకు ఆమోదం ఇవ్వాలి.నేడు జరిగే చాలా గర్భ ధారణలు పెళ్ళికి ముందు జరుగుతున్నవే.కనుకే సమాజంలో ఈ రకమైన అభిప్రాయాలున్నాయి.
పెద్దలు తమ కుటుంబ మాన మర్యాదలు పోతాయేనే భయాలతో రహస్యంగా అసుక్షిత పద్ధతులలో గర్భ విచ్ఛిన్నాలకి మార్గాలు అవలంబిస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణమే వీటికి చట్టపర పరిష్కార మార్గాలు ఆలోచించాలి. బిడ్డకు జన్మనివ్వటం స్త్రీ యొక్క జన్మహక్కని ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలి.