Just In
Don't Miss
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
సర్వే! ‘స్మార్ట్’గా మత్తెక్కించడమే ఆ మగువల పనంట...! అపరిచితులతో వారికి మజా వస్తోందంట...!
భారతీయ మహిళలు స్మార్ట్ ఫోన్లలో అదే పనులే ఎక్కువగా చేస్తున్నారంట. ఆ విశేషాలేంటో చూసేయ్యండి
స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం దీన్ని విడిచి మనం ఒక నిమిషమైనా ఉండలేమంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఇది మన జీవితంలో భాగంగా మారిపోయింది.
అంతేకాదు ఇది మనుషుల్లో సైతం చాలా మార్పును తీసుకొచ్చింది. తీసుకొస్తోంది కూడా. ఎంతో గొప్పదైనా భారతదేశంలో కూడా వసుదైక కుటుంబాన్ని సైతం విడదీసిన ఘనత కూడా ఈ స్మార్ట్ ఫోన్లకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టెక్నాలజీ మనషులన్ని భౌతికంగా దగ్గర చేయాలి కానీ.. మనుషులను భౌతికంగా దూరం చేసి వర్చువల్ గా కలుపుతోంది. ప్రస్తుతం కరోనా సమయంలో ఇదే బెటర్ అని చాలా మంది చెబుతున్నారు. ఇది ఎంతలా అంటే ఇటీవలి కాలంలో పెళ్లిళ్లను సైతం వర్చువల్ లైవ్ టెలికాస్టులో జరుపుతున్నారంటే వీటి వినియోగం ఎంత ఎక్కువగా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదండోయ్ దీని వల్ల మనం ఎవరి వ్యక్తిత్వాలనైనా తెలుసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ స్మార్ట్ ఫోన్లు అమ్మాయిల ఏకాంతాన్ని దూరం చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆ అధ్యయనంలో భారతీయ మహిళలు కూడా ఉండటం గమనార్హం. మహిళలు స్మార్ట్ ఫోన్ ద్వారా ఏకాంతాన్ని ఎలా దూరం చేసుకుంటున్నారు.. దీనికి కరోనా మహమ్మారికి లింక్ ఏంటి విషయాలపై సర్వే చేయగా అందులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
కరోనా నుండి కోలుకున్న వెంటనే ఆ కార్యంలో పాల్గొనొచ్చా?
ఆసక్తికరమైన విషయాలు..
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇంటికే పరిమితమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కపుల్స్, సింగిల్ ఉండే లేడీస్ ఏయే పనులు చేశారనే అంశంపై 'PLOS ONE'లో ఓ అధ్యయనం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
వివాహేతర సంబంధాలు...
చాలా మంది మహిళలు ఈ లాక్ డౌన్ కాలంలో ఏకాంతాన్ని దూరం చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ యాప్స్ ను ఎక్కువగా వినియోగించుకున్నారట. అంతేకాదండోయ్ మన దేశంలోని 19 శాతం మహిళలు సైతం వివిధ రకాలైన యాప్స్ ద్వారా లైంగిక సంబంధాలను, వివాహేతర సంబంధాలను పెట్టుకుంటున్నారని తెలిసిందట.
మొత్తం 62 శాతం మంది..
ఇక మహిళల్లో సుమారు 62 శాతం మంది మహిళలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా మగవారికి మత్తెక్కించే రొమాంటిక్ ముచ్చట్లు చేస్తూ మజా పొందుతున్నారంట.
ఆ విషయాల్లో మగవారు చేసే అతిపెద్ద పొరపాట్లేంటో తెలుసా...!
పెరిగిన సెక్స్టింగ్..
ప్రస్తుతం చాలా మంది ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది దీనికి బాగా అడిక్ట్ అయిపోయారు. ఉదాహరణకు తమకు తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా.. కూడా పోస్టులను పెట్టేస్తున్నారు. అదేమాదిరిగానే ‘సెక్స్ టింగ్'.. (అమ్మాయి, అబ్బాయిలు తమ ఫోన్ల నుండి రొమాంటిక్ ముచ్చట్లు, వీడియోలను, సెక్సీ ఫోటోలను షేర్ చేసుకోడం) ఎక్కువగా చేస్తున్నారంట.
191 దేశాల్లో..
ప్రపంచంలోని సుమారు 191 దేశాల్లో ‘Mobile sex-Tech Apps' అనే అంశంపై నిర్వహించిన సర్వేలో లక్షా 30 వేలకు మందికి పైగా మహిళలకు సీక్రెట్ ప్రశ్నలు పంపించారట. ఇందులో 23,093 మహిళలు కూడా ఉండటం గమనార్హం.
స్మార్ట్ సెక్స్..
సెక్స్టింగ్ అనేది ఇదివరకు కేవలం విదేశాల్లో, ముఖ్యంగా పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలో మాత్రమే ఎక్కువగా ఉండేది. అయితే తాజా సర్వేలో ప్రపంచంలోని చాలా దేశాల్లో అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లను తమ శృంగార అవసరాల కోసం వాడుకుంటున్నారని తేలింది.
అధ్యయనం! శృంగారంలో మాస్కులతో పాటు అవి తప్పకుండా వాడాలంట...!
నాలుగు రెట్లు ఎక్కువగా..
వివిధ దేశాల్లో అమ్మాయిలు డేటింగ్ యాప్స్ వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ.. ‘సెక్స్టింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందట. ఇది లింగ సమానత్వం ఉన్న ప్రాంతాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
అపరిచితులతో శృంగారం..
మొత్తానికి స్మార్ట్ ఫోన్లలోని అప్లికేషన్లు.. అపరిచితులతో ఆ కార్యంలో పాల్గొనేందుకు.. కొత్త సంబంధాలకు దారి తీస్తున్నాయట. అయితే ఇది ఇలానే కంటిన్యూ అయితే, చాలా కష్టమే.
దీనిపై మీరేమంటారో కామెంట్స్ విభాగంలో తెలియజేయండి...