Just In
- 3 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 4 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 6 hrs ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- 9 hrs ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...
బీహార్ రాష్ట్రంలో ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రి కొడుకులు చివరకు ఏం చేశారో చూడండి...
మన దేశంలో బంధాలు, అనుబంధాలకు ఎంతో విలువ ఉంది. ఆప్యాయన, అనురాగాలకు మన భారతదేశాన్ని పుట్టినిల్లుగా ఎందరో విదేశీయులు ప్రశంసిస్తుంటారు. ఇంత పెద్ద దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధ్యమా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు.
అయితే ప్రస్తుతం మన దేశంలో కూడా వావి వరసలు మరిచిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో రోజురోజుకు చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవలే తెలంగాణలో వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి 9 మందిని హత్య చేసిన సంగతిని మరువకముందే... బీహార్ లో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కడ ఓ మహిళపై ఏకంగా తండ్రీ కొడుకులు కన్నేశారు.
అంతేకాదు వారిద్దరూ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఆమెపై చాలా ఒత్తిడి తెచ్చారంట. అయితే ఆ మహిళ అందుకు ఒప్పుకోకపోవడంతో తనని చాలా దారుణంగా వేధించారంట.
ఆమెపై భౌతిక దాడి కూడా చేశారంట. అదీ కూడా పట్టపగలు నడిరోడ్డుపై ఈ పని చేయడంతో స్థానికులు ఈ సంఘటనను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ తండ్రీ కొడుకులను పట్టుకున్నారా? లేదా వారు పారిపోయారా అనే దానిపై ఆరా తీయగా వారి గురించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయంట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం రండి...
మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తే ముందు ఈ విషయాలను మరవొద్దు సుమా...!
మహిళపై కన్ను..
బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా మెన్ హర్ పోలీస్ స్టేషనులో వాచ్ మెన్ గా పని చేస్తున్న జగన్ పాశ్వాన్, అతని కొడుకు ధర్మేంద్ర పాశ్వాన్ అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళపై కన్నేశారంట.
దాని కోసం ఒత్తిడి..
వావి వరసలు మరచిని ఆ తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి అదే మహిళతో రతి క్రీడలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారట. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారంట.
నడిరోడ్డుపై వేధింపులు..
తాము కోరుకున్నట్టు ఆమె తమ కోరికను తీర్చకపోవడంతో సదరు మహిళను నడిరోడ్డుపై గొడ్డును బాదినట్టు బాదేశారంట. దీంతో ఆమె ఆ దెబ్బలకు మతిస్థిమితం కోల్పోయిందట.
రతి క్రీడ గురించి మగాళ్లకు ఉండే కోరికలు, కలలు ఎలా ఉంటాయో తెలుసా...
వారితో చెప్పడంతో..
దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వారు ఆమెను ఏమి జరిగిందని అడిగితే.. జరిగిన విషయం వారితో చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శారీరక సంబంధాలు..
ఈ తండ్రీ కొడుకులకు పలువురు మహిళలతో శారీరక సంబంధాలున్నాయని, తన భార్య అందుకు ఒప్పుకోలేదని, ఆమెను తీవ్రంగా హింసించారని, భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.