Just In
- 3 hrs ago ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- 3 hrs ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 7 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 8 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
ఊర్వశి మరియు పురూరవుడు యొక్క ఒక విషాద ప్రేమ-ఉద్వేగమైన కథ
హిందూ పురాణాల శాస్త్రం విస్మయం కలిగించే-స్పూర్తినిచ్చే కథలతో నిండి ఉన్నది. భారతదేశపు పిల్లలు దాదాపు అందరు కూడా రామాయణం, మహాభారతాల గురించి వింటూ పెరుగుతున్నవారే! ఈ రెండు పురాణాలు కూడా మానవ జీవనం మీద గొప్ప ప్రభావం చూపించే మూలాలు. ఈ పురాణాలు అత్యంత అద్భుతమైన కథలతో నిండి ఉండి, మనలను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తి ఉంచే తరగని వనరులు.
రాజులు, యువరాణులు, శక్తివంతమైన యోధులు మరియు ఖగోళ నిమ్ప్స్ వంటి అసంఖ్యాక కథలతో ప్రతి ఒక్కరిని ఆకర్షితులిని చేస్తూఉంటాయి. ప్రేమ ద్వేషం, అహంకారం, దురాశ వంటి దారాలతో ఈ మనోహరమైన కథలను నేశారు. ఈ కధలు శతాబ్దాలుగా జీవించి ఉన్నాయి, ఉంటాయి మరియు ఒక తరం నుండి ఇంకో తరానికి ప్రయాణిస్తూనే ఉంటాయి మరియు వాటి యొక్క గొప్పతనం,ఆకర్షణ కోల్పోవడం అంటూ జరగదు.
మహాభారతం నుండి అటువంటి మనోహరమైన కథ, ఒక మానవ రాజు పురూరవుడితో ఊర్వశి అనే ప్రఖ్యాతి చెందిన అప్సరస (ఖగోళ వనదేవత) ప్రేమ కథ. దేవలోకపు వాసులు, భూలోకపువాసులతో ప్రేమలో పడటం అన్న ప్రస్తావన భారత పురాణాలలో సర్వసామాన్యం. మేనక మరియు విశ్వామిత్రుడు, రంభ మరియు శుక్రాచార్యుని కథలు, అప్సరసలు మరియు మానవుల మధ్య ప్రేమ కథలకు కొన్ని ఉదాహరణలుగా నిలిచి ఉన్నాయి.
ఈ కథల వంటిదే ఊర్వశి మరియు పురూరవుడి అందమైన ప్రేమ కథ. ఈ కథలో ప్రేమ, అభిమానం, అసూయ మరియు విడిపోవటం వంటివి కలగలిపి ఉన్నాయి. ఊర్వశి మరియు పురూరవుడి కథ విందాం.
పురూరవుడు : చంద్ర వంశ రాజు
పురూరవుడు, చంద్రరాజులలో (చంద్రవంశం) మొట్టమొదటివారు మరియు బుధుడు మరియు ఐలా యొక్క కుమారుడు. బుధుడు, సోమ్ (లేదా చంద్ర, చంద్రుడు), తార యొక్క కుమారుడు (నిజానికి ఈమె ఋషి, బృహస్పతి భార్య). పురూరవుడు ఒక ధైర్యవంతుడు అయిన యుద్ధవీరుడు మరియు అసురులతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేక సార్లు ఆహ్వానించాడు. ఊర్వశి, ఇంద్రుడి సభలో అప్సర ఒకసారి స్వర్గలోకంతో విసుగు చెందింది మరియు ఆమె స్నేహితులతో పాటు ఆనందించడానికి భూమ్మీదకు వొచ్చింది. ఆమె భావోద్వేగాలు లేని స్వర్గసుఖాలతో విసుగు చెందింది మరియు ఆమె భూలోక జీవితానికి ప్రాధాన్యమిచ్చింది. అలా భూమి మీదకు వొచ్చిన ఆమె, పురోగమన సమయంలో దేవలోకానికి తిరిగివెళ్తుండగా, ఆమెను ఒక అసురుడు అపహరించాడు.
మాయ స్పర్శ
ఊర్వశి ఇతర అప్సరసలతో స్వర్గానికి తిరిగి వొస్తున్న సమయంలో ఆమె ఒక అసురుడి చేత అపహరణకు గురైంది. ఇది చూసిన పురూరవుడు అతని రథంపై ఆ అసురుడిని వెంబడించాడు మరియు అతని బారి నుండి ఊర్వశికి విముక్తి కలిగించాడు. ఆ సంఘటనలో వారి శరీరాలు తాకిన క్షణకాలం ఎప్పటికీ వారి జీవితాలను మార్చివేసింది. మొదటి సారి, ఊర్వశి ఒక భౌతికశరీర వెచ్చని స్పర్శను అనుభవించింది మరియు తనలో ఒక బలమైన వాంఛ రగుల్కొంది. అదేవిధంగా, పురూరవుడిలో ఆ అప్సరస పట్ల అదే భావన కలిగింది. అయితే, ఆ భావాలు పరస్పరం కలిగాయని వారిలో ఎవరికి తెలియదు.
ప్రేమ చిగురించింది
ఒక నాటక సమయంలో ఊర్వశి లక్ష్మీ దేవిగా నటిస్తున్నప్పుడు, ఆ నాటకంలో ఊర్వశి "పురుషోత్తమా" అని విష్ణువుని సంభోదించవలసినప్పుడు దానికి బదులుగా ఆమె ప్రేమికుడి పేరు "పురురవా" అని సంభోదించింది. ఇది నాటకం దర్శకత్వం చేస్తున్న భారత ఋషికి ఆగ్రహం తెప్పించింది మరియు అతను ఆమెను భూలోకానికి వెళ్లి అతనితో ఉండమని మరియు అతనిద్వారా సంతానం పొందమని శపించాడు. పూర్తిగా పురూరవుడి ప్రేమలో మునిగిపోయిన ఆమె ఋషి శాపాన్ని పట్టించుకోలేదు. ఇంకోవైపు స్వర్గలోకసుందరి తనకోసం, తన ప్రేమకోసం దిగి వొస్తుందని ఊహించని పురూరవుడు విచారంగా ఉన్నాడు. తన భార్యకు సంతానయోగం లేదని అతను చాలా విచారంలో మునిగి ఉన్నాడు. ఈ సమయంలో, ఊర్వశి పురూరవుడి కోసం వొచ్చింది మరియు ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు.
నిబంధనలు
ఊర్వశి జీవితాంతం పురురవుడితో కలిసి ఉండటానికి అంగీకరించింది. కానీ ఆమె కొన్ని నిబంధనలను పెట్టింది. అందులో మొదటి నిబంధన ఆమెతో పాటు రెండు మేకలు తెచ్చుకుంటానని, వాటి భద్రత విషయంలో పూర్తిగా రాజే బాధ్యతా వహించాలని. రెండవ నిబంధన ఆమె భూమిపై నివసించిన సమయంలో, ఆమె కాచిన వెన్న (నెయ్యి) మాత్రమే ఆహారంగా తీసుకుంటానని మరియు మూడవ నిబంధన వారు శృంగార సమయంలోతప్ప ఒకరిఒకరు నగ్నంగా కనపడకూడదని. ఈ నిబంధనలు ఇద్దరిలో ఎవరు అధిగమించినా ఆ క్షణంలోనే ఊర్వశి పురురవుడిని వొదిలి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళిపోతానని చెప్పింది. పురూరవుడు అన్ని నిబంధనలను అంగీకరించాడు మరియు వారు గంధమదన్ తోటలో కలిసి నివసించటం ప్రారంభించారు.
దేవతల కుట్ర
మరోవైపు, ఊర్వశి మరియు పురూరవుడి మధ్య ప్రేమ దేవతలకు చాలా అసూయగా మారింది. స్వర్గలోకం ఊర్వశి లేకుండా చాలా మందకొడిగా కనిపించింది. కాబట్టి, ఊర్వశిని రప్పించాలని వారు ఒక పన్నాగం పన్నటానికి నిశ్చయించుకున్నారు. చివరకు,ఒక రాత్రి, గంధర్వులు మేకలను దూరంగా తీసుకెళ్ళారు. మేకలు 'మే మే' అని అరవటం ప్రారంభించాయి, ఊర్వశి విచారంతో,వెంటనే వెళ్ళి వాటిని రక్షించమని రాజును కోరింది. ఆ సమయంలో పురూరవుడు నగ్నంగా ఉన్నాడు. నిద్రలోనుండి ఉలిక్కిపడి లేచాడు. ఆ సమయంలో, గంధర్వులు స్వర్గం నుంచి కాంతిని పురూరవుడు మరియు ఊర్వశి మీద ప్రసరింప చేయటంచేత, వారిద్దరూ ఒకరికొకరు నగ్నంగా చూసుకున్నారు.
విషాదం
మూడవ నిబంధన అధిగమించబడింది, దీనివలన ఊర్వశి స్వర్గానికి వెళ్ళే సమయం ఆసన్నమయింది. భారమయిన హృదయంతో, ఆమె కలత చెంది చిత్తరువై నిలబడి ఉన్న రాజువైపు తిరిగింది. ఆ సమయంలో, ఊర్వశి పురూరవుడి సంతానాన్ని మోస్తున్నది. ఆమె ఒక సంవత్సరం తరువాత కురుక్షేత్ర ప్రాంతసమీపానికి రాజును వొచ్చి అతని సంతానాన్ని తీసుకోమని కోరింది. తరువాత, ఇతర సంఘటనలు జరిగి ఊర్వశి భూమిమీదకు మళ్లీ మళ్లీ వొచ్చింది మరియు పురూరవుడితో చాలా సంతానాన్ని పొందింది.