Just In
- 11 min ago Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- 1 hr ago మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- 2 hrs ago సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- 5 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
కుబేరుడిని ఇలా పూజిస్తే ధనం మీ సొంతం! కుబేరుడు పార్వతిపై ఎందుకు కన్నేశాడు? దొంగ ధనాధిపతి ఎలా అయ్యాడు
డబ్బు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరినీ మనం కుబేరులు అంటూ ఉంటాం. ఇక మనకు కుబేరుడనగానే వేంకటేశ్వరస్వామికి ఆయన కల్యాణ సమయంలో అప్పిచ్చిన వాడిగానే తెలుసు. ధనాధిపతి కుబేరుడు, కుబేరుడు పూజ, కుబేరుడి పూజ
డబ్బు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరినీ మనం కుబేరులు అంటూ ఉంటాం. ఇక మనకు కుబేరుడనగానే వేంకటేశ్వరస్వామికి ఆయన కల్యాణ సమయంలో అప్పిచ్చిన వాడిగానే తెలుసు.వెంకటేశ్వరుని అంతటివానికే అప్పిచ్చాడంటే ధనానికి తక్కువవాడు కాదని. డబ్బున్న మారాజుల్ని కుబేరులతో పోలుస్తాం. అంతకు మించి కుబేరునికి ఒక కథ కూడా ఉంది.
కుబేరుడు తొలిజన్మలో యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుని కుమారుడు. పేరు గుణనిథి. ఎలాంటి గుణాలకు నిధి అనుకున్నారు? దొంగతనం, వ్యభిచారం, క్రూరత్వం, దుర్మార్గం... ఇవే అతని గుణాలు. అలా ఉంటే ఏ తండ్రయినా ఏ చేస్తాడు? ఇంటి నుంచి పొమ్మన్నాడు. పోయాడు. కాని తినేందుకు తిండి కూడా లేకపోయింది. దాంతో ఎవరో శివుణ్ణి పూజించి ప్రసాదం పెట్టుకొని ఉంటే దొంగిలించాడు.
యమదూతలు వచ్చారట
ఆబగా ఆకలికి నోట్లో వేసుకున్నాడు. చూసిన రాజభటులు ఊరుకుంటారా? లేదు, వెంటపడ్డారు. కాని ఇంతలో చీకటయిపోవడంతో వారికి చిక్కలేదు! చివరికి చనిపోయిన కుబేరుని తీసుకెళ్ళాలని యమదూతలు వచ్చారట. విష్ణుదూతలూ వచ్చారట. శివుని ప్రసాదం తిన్నందువల్ల విష్ణుదూతలే తమవెంట తీసుకెళ్ళిపోయారట!
పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు
మలిజన్మలో కళింగాధీశుడైన ఆరిందముడి కుమారుడు. పేరు దముడు. రాజ్యపాలన చేపట్టినా గుడుల్లో దీపాలు వెలిగించాడు. కాశీపట్టణంలోని విశ్వేశ్వరుణ్ని ప్రార్థించాడు. పూజలకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. తేజాన్ని చూడలేక చూసే శక్తి నడిగాడు. శివుడిచ్చాడు. చూడగలిగే శక్తి కన్నులకు వచ్చాక పార్వతిని చూస్తూ ఉండిపోయాడు. అక్కడితో ఆగలేదు.
పార్వతి అంద చందాల్ని వర్ణించాడు
పార్వతి అంద చందాల్ని భర్తముందే వర్ణించాడు. పార్వతికి కోపం వచ్చింది. దాంతో చూస్తున్న కుబేరుని కుడికన్ను పగిలిపోయింది. వీడెవడంటూ పార్వతి కోపగించుకుంటే మనబిడ్డ వంటివాడు అన్నాడు శివుడు. భక్తుడన్నాడు. దయచూపమన్నాడు. పార్వతి భర్తమాట కాదనలేక కరుణించింది. కన్ను చెడినా దృష్టి చెడకుండా వరమిచ్చింది. ఇదంతా శివపురాణంలోని కథ.
నలకుబేరుడనే కొడుకును పొందాడు
ఇక ఉత్తర రామాయణంలో మరోకథ కూడా ఉంది. విశ్రవశునికి ఇలబిలకు పుట్టినట్టు తండ్రి గురించికాక తాత బ్రహ్మ గురించి తపస్సు చేసినట్టు కథ ఉంది. రావణుడు ఇతని సవతి సోదరుడు. కుబేరుడు బ్రహ్మ నుంచి తపస్సు వల్ల అయిదు వరాలు పొందాడు. ఒకటి నలకుబేరుడనే కొడుకును పొందాడు. రెండు లోకపాలకత్వాన్ని కోరాడు. మూడు ధన ధాన్యాది ఐశ్వర్యాలను పొందాడు. నాలుగు శంకరునితో స్నేహాన్ని కోరాడు. ఐదు లంకాపురాన్ని పొందాడు.
విశ్రవసునికి కోపం వచ్చింది
అయితే తనను పూజించనందుకు విశ్రవసునికి కోపం వచ్చింది. అపకారం తలపెట్టబోతే కుమారుడనని గుర్తు చేసాడు. సపర్యలు చేయడానికి ముగ్గురు యువతుల్ని పంపాడు. వారే పుష్పోత్కట, మాలిని, పాక. విశ్రవశునివల్ల పుష్కోత్కటకు రావణ కుంభకర్ణులు, మాలినికి విభీషణుడు, పాకకు ఖరుడు, శూర్పణఖ పుట్టారు. పుష్పక విమానం ఎక్కితిరుగుతున్న కుబేరుణ్ణి చూసి కైకసి అసూయనూ కోరికనూ రావణుని ముందు బైట పెట్టింది.
శివునితో స్నేహం చేసాడు
రావణుడు ఘోర తపస్సుచేసి అంతకు మించిన పుష్పక విమానం సాధించడమే కాదు, సుమాలి వచ్చి కుబేరుడు వచ్చి ఉండడానికి ముందు లంక రాక్షసులదేనని చెప్పడంతో కుబేరుణ్ణి లంకను వదిలిపొమ్మన్నాడు. కుబేరుడు తండ్రి దగ్గరకు వెళితే కైలాస మార్గం చూపాడు. కుబేరుడు శివునితో స్నేహం చేశాడు. అలకాపట్టణాన్నీ పొందాడు.
గుడ్లగూబకన్ను
శివుని తొడమీద కూర్చున్న పార్వతిని కుడికంటితో కుబేరుడు చూశాడు. గుణం పసిగట్టిన పార్వతి కోపంతో చూడడంతో కుబేరుని కుడికన్ను పగిలిపోయింది. మళ్ళీ తపస్సు చేసిన కుబేరుడు చెడిన కన్నుకు చూపు తెచ్చుకున్నాడు. దాన్నే పింగళాక్షి అన్నారు. అంటే గుడ్లగూబకన్ను గలవాడు అదే పింగళాక్షుడన్నమాట!
మరో కథ కూడా ప్రచారంలో ఉంది
కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు.
అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు.
గర్భం దాల్చింది
పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు.
ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడుని చూడటం తటస్థించింది. వెంటనే గర్భం దాల్చింది.
పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి
భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు.
పూజించిన వారినే
కుమారులైన మణిగ్రీవ - నలకూబరులే కాకుండా, అనేకమంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని, తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు.
ఐల్వల్యుడు
ఈ కారణంగానే చాలామంది ఆయనను 'దీపావళి' రోజున పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ...అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే, అనతికాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.కుబేరుడి తల్లిదండ్రులు విశ్రావసుడు - ఇలవిల. ఈ కారణంగానే కుబేరుడిని 'వైశ్రవణుడు' అనీ ... ఐల్వల్యుడు అని పిలుస్తుంటారు. తన కఠోరమైన తపస్సుచే బ్రహ్మదేవుడిని మెప్పించి, ఆయన అనుగ్రహంతో అష్టదిక్పాలక పదవిని ... నవనిధులకు అధిపతి స్థానాన్ని సంపాదించాడు.
అప్పుగా తీసుకుంటాడు
కుబేరుడు ఒక చేతిలో గదను కలిగివుండి ... మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. ఆయన చుట్టుపక్కల నవనిధుల రాశులు దర్శనమిస్తుంటాయి.కుబేరుడు ధనాధిదేవత. వెంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని హిందువుల నమ్మకం.
సిరిసంపదలకు , నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయరాజు, నరరాజు.
కుండ వంటి పొట్టతో
అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా !కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షనాలన్న)శరీరము కలవాడు(బేరము అంటే శరీరం )అని అర్ధం.
పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరుగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్లు, ఒకే కన్ను , ఎనిమిది పళ్లతో ఉంటాడు.
ధనానికి అధిపతి కుబేరుడే
ఇక ఈ విశ్వంలో సంపద ఏదైనా ... అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే అని చాలా మంది నమ్ముతారు. పద్మ ... మహాపద్మ ... శంఖ ... మకర ... కచ్చప ... ముకుంద ... కుంద ... నీల ... వర్చస అనే 'నవ నిధులు' ఆయన ఆధీనంలో వుంటాయి. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా పూజ చేయండి.
తూర్పువైపున కూర్చోండి
మీరు స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోండి. చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి. కలశాన్ని ఉంచండి. నెయ్యితో దీపాలు వెలిగించండి. భూమి, కలశాన్ని పూజించండి.
కుబేరుని యంత్రం
విఘ్నాలను తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి. కుబేరుని యంత్రం, ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచండి. ధాన్యం, బెల్లం అర్పించండి. బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయండి.
108సార్లు జపించండి
కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించండి. ఐదుసార్లు ఓం గం గణపతయే నమః అని జపించండి. ఓం శ్రీ కుబేరాయ నమః , ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసిమాలతో 108సార్లు జపించండి. ఇంట్లో స్వస్తిక్ గుర్తునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు.