Just In
- 33 min ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 1 hr ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 4 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
- 12 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
మీ ఇంట లక్ష్మీదేవి గృహప్రవేశం చేయాలంటే కంపల్సరీ దీపాలు వెలిగించాలి..!!
‘‘దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారము''
హిందు పండగలన్నింటిలోకి, ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగ దీపావళి, అన్ని పండుగలకి తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకోవడం, బందుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది. కానీ, ఈ పండుగకి వీటన్నింటితో పాటు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే ''దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం ' దీనికి సంబంధించిన విష్ణు పురాణంలో ఒక కథ కనబడుతుంది. దీపావళి నాడు మహాలక్ష్మీ విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయడానికి బయలు దేరిన లక్ష్మీ దేవి ఏ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం??
లక్ష్మీ అనుగ్రహం కోరుకునే వారు అప్పటి నుంచీ దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించడం ప్రారంభించారు. లక్ష్మీ దేవి తనవాహనమైన గుడ్ల గూబ ఎక్కి, సూర్యాస్తమయ సమయం, అనగా సాయం సద్య లేక ప్రదోష వేళ నుండి అర్ధరాత్రి వరకూ సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణపురాణంలో ఉంది.
''దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారము''
''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళి రాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్జానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతోనే. మాములు చీకట్లే కాదు, అజ్జానం, దు:ఖం, శోకం, అలసత, రోగం, మాంద్యము, మ్రుత్యువు మొదలైనవన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం.
పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' సూర్యుడు తన సహస్రకకరాలతో అందరికీ వెలుగును పంచుతాడు. కానీ ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయామయుడైన కర్మాసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. 'దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన:''ఆ అగ్ని దేవుని మన ఇంట్లోని దీపమందు ఆవాహన చేసినట్లయితే ముల్లోకముల యందలి చీకట్లను పారదోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం..!
"సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతిమిరాపహామ్ '' ఇంతటి మహాదాశయంతో, సద్భావనతో , సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మీకి ప్రతి రూపం అవటం, దానిని చూసి లక్ష్మీ దేవి అనుగ్రహించటం సమంజసమే.
దీపాలని చూసి లక్ష్మీ అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెబుతారు. చతుర్మాస్యం పూర్తి అయిన శ్రీమహావిష్ణువు నిద్రమేల్కొనే రోజుగా దీపావళిని చెబుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనుక దీపాలు వెలిగించాలట.
దీసావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసి కోట దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికి ఒక పద్దతుంది. తులసి పూజ అయినాక, కృత్తిక నక్షత్ర దర్శనం చేయాలంటారు. ఈ నెల అంతా కృత్తికల పేరు గలది కదా! తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారు జామున దామోదరుని, పగలు, శివుణ్ణి, సాయంత్రం లక్ష్మీని ఆరాధించాలి.