Just In
- 22 min ago Kendra Trikon Rajyog 2024 కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 4 రాశుల వారు ధనవంతులు అవుతారు, లక్ష్మికటాక్షం వీరికే?
- 2 hrs ago Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- 3 hrs ago మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- 5 hrs ago సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
Bhogi 2023: సంక్రాంతికి భోగిపళ్ల సంప్రదాయం ఎందుకు వచ్చింది ?
సంబరాల సంక్రాంతి వచ్చేసింది. రంగురంగుల ముగ్గులు, ముద్దుల గొబ్బెమ్మలు, వినసొంపైన హరిదాసు కథలు, గంగిరెద్దుల గలగలలు, చిన్నారులు మెచ్చే భోగిపళ్లు, పెద్దలు వేసే భోగి మంటలు, కమ్మని బొబ్బర్లు, పిల్లల కేరింతలతో.. సకల శుభాలతో సంక్రాంతి వచ్చేసింది. రకరకాల సంప్రదాయాలు, సంబరాలతో సంక్రాంతి సందడి పల్లె వాతావరణానికి అద్దం పడుతుంది.
పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరిలో వస్తుంది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతాయి. హిందువులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చేదే భోగి.
తెలుగువాళ్లకు సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అంటేనే అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు, భోగి పళ్లు. పిల్లలు ఎంతో సరదాగా గడిపే ముచ్చట భోగిపళ్ల పేరంటం. భోగి రోజు రేగుపళ్లు కాస్త భోగిపళ్లు మారిపోతాయి. అసలు భోగిపళ్లు ఎందుకు పోస్తారు ? రేగుపళ్లనే భోగిపళ్లు ఎందుకు పిలుస్తారు ? రేగుపళ్లనే ఎందుకు ఎంచుకున్నారు ?
రేగుపళ్లను ఇండియన్ డేట్, ఇండియన్ జుజుబీ అని పిలుస్తారు. రేగుపళ్ల ప్రస్తావన పురాణాలలో ఉంది. నారాయణులు బదరీ వృక్షంగా పిలువబడే రేగు చెట్టు దగ్గరే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారని.. అందుకే ఆ ప్రాంతానికి బదరీక్షేత్రం అని పేరు వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణంలో.. ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని రేగుచెట్టు పెరుగుతుందట. అలాగే సంక్రాతి సమయానికి రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పులుపు, తీపి రుచి కలిగిన ఇవి.. అమోఘమైన రుచినే కాదు.. ఆరోగ్యానికి మంచిదే. అందుకే పిల్లల తలపై భోగిపళ్లు పోసే సంప్రదాయానికి రేగుపళ్లనే ఎంచుకున్నారు.
ఐదేళ్లలోపు పిల్లలకి భోగి పండుగ రోజు భోగిపళ్లు పోస్తారు. వీటినే ఎందుకు పోస్తారు అంటే.. ఐదేళ్లలోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. కాబట్టి రేగుపళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి రేగుపళ్లు వాళ్లపై పోయడం వల్ల.. వాటికి ఎట్రాక్ట్ అయి తినడానికి ఇష్టపడతారు. అందుకే రేగుపళ్లు.. భోగినాటికి భోగిపళ్లుగా మారిపోతాయి.
రేగుపళ్లతో పాటు, డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరకు ముక్కలు వాడతారు. బంతిపూల రెక్కలు వాడటం వెనకు కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. బంతిపూలకు క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. అలాగే చర్మ సమస్యలతో పోరాడుతుంది. కాబట్టి వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు.