Tap to Read ➤

మీనంలోకి కుజుడి సంచారం.. ఈ రాశులకు అదృష్టం..!

2022లో మే మాసంలో కుజుడు మీనంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...
Venkatesh S
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అంగారకుడి(కుజుడు) రవాణా ఎంతో శక్తివంతమైనది. అంగారకుడిని గ్రహాల అధిపతిగా పరిగణిస్తారు.
కుజుడు 2022 సంవత్సరంలో మే 17వ తేదీన అంటే మంగళవారం ఉదయం 9:52 గంటలకు తన మీనంలోకి ప్రవేశించనున్నాడు.
ఇదే రాశిలో జూన్ 27వ తేదీ వరకు ఉదయం 6 గంటల వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు.
కుజుడి రవాణా వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా ఎంతో మేలు జరగనుందట. ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం...
మీన రాశిలోకి కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి స్నేహాన్ని మరియు సంబంధాన్ని కొనసాగించొచ్చు.
కుజుడి సంచారం సమయంలో కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి.ఈ సమయంలో, మీరు దీర్ఘకాలిక ప్రణాళికలలో పెట్టుబడి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి వారికి కుజుడి సంచారం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీ ప్రేమ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి వారు కుజుడి సంచారం సమయంలో మీ ప్రియమైన వారి పట్ల మరింత సున్నితంగా ఉంటారు. ఈ సమయంలో వాహనం లేదా భూమి కొనుగోలు కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు.
కుజుడి అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం నవగ్రహ లేదా గాయత్రీ మంత్రాన్ని పఠించండి.