Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.!
Karnataka Polls 2023: కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు వీరే
మహిళలు ప్రతి రంగంలోనూ సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం మహిళల స్థానం ఇప్పటికీ నామమాత్రమే. చెప్పుకోదగ్గ స్థానాల్లో పోటీ కూడా చేయలేని పరిస్థితి. గెలుపోటముల గురించి పక్కన పెడితే కనీసం పోటీలో కూడా ఉండటం లేదు. తాజాగా జరిగిన కర్ణాటకలోనూ కేవలం పదుల సంఖ్యలోనే మహిళలు పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది మహిళలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వారి పేర్లు, నియోజవర్గం, ఏ పార్టీ నుండి పోటీ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జొల్లే శశికళ అన్నాసాహెబ్:
జొల్లే శశికళ అన్నాసాహెబ్ నిప్పాని నియోజకవర్గం నుండి గెలుపొందారు. బీజేపీ తరఫున పోటీ చేసిన జొల్లే శశికళ అన్నాసాహెబ్ 72,952 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. జొల్లే శశికళ గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి దక్కించుకున్నారు.
2. మంజులా.ఎస్:
మంజులా.ఎస్ మహదేవపురా నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మంజులా.ఎస్.. లక్షా 61 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు.
3. భగీరథి మురుల్యా:
భగీరథి మురుల్యా సులియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మహిళా రైతు ఈ ఎన్నికల్లో 67 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ తరఫున పోటీ చేసి శాసనసభకు వెళ్లనున్నారు.
4. రూప కళ ఎమ్:
రూప కళ.ఎం కోలార్ గోల్డ్ ఫీల్డ్ నియోజవర్గం నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచిం రూప కళ.. 81 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన రూపకళ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
5. కనీజ్ ఫాతిమా:
కనీజ్ ఫాతిమా ఉత్తర గుల్బార్గా స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 80 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
6. లతా మల్లిఖార్జున్:
లతా మల్లిఖార్జున్ హరపనపల్లి నియోజవర్గం నుండి గెలుపొందిన స్వతంత్ర్య అభ్యర్థి. 70 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యే గెలిచారు.
7. లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్:
లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బెల్గామ్(రూరల్) నియోజవర్గ స్థానం నుండి పోటీ చేశారు. 78 వేలకు పైగా ఓట్లు సాధించి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
8. సౌమ్య రెడ్డి:
జయనగర్ నియోజవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు సౌమ్య రెడ్డి. అయితే మొదట సౌమ్య రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 294 ఓట్ల మెజారిటీ సాధించినట్లు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్లపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి లెక్కించగా.. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య కంటే బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తికి 16 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అలా జయనగర్ లో బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి ఎన్నికయ్యారు.
9. నయన మోతమ్మ:
నయన మోతమ్మ ముదిగెరె స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నయన.. 21 వేలకు పైగా ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు.
10. శారదా పూర్యనాయక్:
షిమోగా రూరల్ స్థానం నుండి జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 48 వేలకు పైగా ఓట్లు సాధించి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
11. కారెమ్మ:
దేవదుర్గ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు కారెమ్మ. జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కారెమ్మ 61 శాతానికి పైగా ఓట్లు సాధించి గెలుపొందారు.



Click it and Unblock the Notifications