పసిబిడ్డల ఆరోగ్యం కొరకు... !

By B N Sharma

newborn
అప్పుడే పుట్టిన పసికందుల్ని డాక్టర్లు, నర్సులు వంటి వారే చూసుకుంటూ వారి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహిస్తారులే అని భావించరాదు. పుట్టిన బిడ్డ విషయంలో డాక్టర్లు, నర్సులు ఎంత శ్రధ్ధ వహించినప్పటికి తల్లిదండ్రులు అధికంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దేశంలో కొత్తగా పుట్టిన పసిబిడ్డల పరిస్థితిని తెలిపే నివేదికల గణాంకాలు చూస్తే ఎంతో ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయి. దేశంలో ప్రతి ఏటా మరణిస్తున్న సంవత్సరంలోపు వయసు ఉన్న పిల్లల్లో 50 శాతం మంది పుట్టిన నెలరోజుల లోపే మరణిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అపుడే పుట్టిన బిడ్డల విషయంలో ఎలా జాగ్రత్త వహించాలనేది పరిశీలించండి.

- బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు వ్యవధిలోనే తల్లి బిడ్డకు ముర్రుపాలు తాగించాలి.
- బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో వుంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా వుంచాలి.
- బిడ్డ శ్వాసక్రియ సరిగా ఉందా లేదా అనేది ఎప్పటికపుడు గమనిస్తూండాలి.
- బిడ్డ సరైన బరువుతో పుట్టిందా? లేదా అనేది చెక్ చేసి అవసరమనుకుంటే వైద్యుల సలహాలు పొందండి.
- పిల్లలకు పుట్టిన వెంటనే వేయాల్సిన పోలియో చుక్కలు, సూదిమందులను వేయమని డాక్టర్ ను కోరండి.
- ఏ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చినాయని గుర్తించినా, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పిల్లల వైద్యులను తప్పక సంప్రదించాలి.

Story first published: Wednesday, January 4, 2012, 16:55 [IST]
Desktop Bottom Promotion