బిడ్డ జననం తర్వాత మహిళలో శారీరక మార్పులు!

By B N Sharma

Postnatal Changes in A Women!
బిడ్డ పుట్టిన వెంటనే మహిళలకు రక్తస్రావం అధికంగా అవుతుంది. దీనిని లోచియా అంటారు. మొదటి 12 గంటలలో అధికంగా వుండి తర్వాత తగ్గుతుంది. ఈ రక్తం ఎర్రటి ఎరుపు రంగులో మొదటి రెండు రోజులూ వుండి తర్వాత పింక్ లేదా బ్రౌన్ రంగులకు మారుతుంది. బిడ్డ పుట్టినప్పటినుండి సుమారు 4 వారాలపాటు ఈ రక్తస్రావం వుంటుంది. అయితే, కొంతమంది మహిళలకు ముందుగానే ఆగిపోవచ్చు.

ఆమె కటి ప్రదేశం క్రమంగా బలం పుంజుకుంటుంది. కటి ప్రదేశం బలపడటానికి గాను మహిళ పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. జననం తర్వాత మూత్రం పోయటం కష్టం అవుతుంది. ప్రత్యేకించి కుట్లు పడినపుడు సమస్యగా వుంటుంది. అటువంటపుడు మూత్రం పోసేటపుడు జననాంగంపై వేడి నీరు పోస్తూ వుంటే కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. బిడ్డ జననం తర్వాత మహిళకు మొదటి రెండు లేదా మూడు రోజులు మూత్రం అధికంగా వుంటుంది. దీనికి కారణం, గర్భంతో వున్నపుడు శరీరంలోని నీరు బయటకు రావటమే.

బిడ్డ జననం తర్వాత మహిళ స్తనాలలో మార్పు వస్తుంది. తల్లిపాలు పట్టడంతో హార్మోన్ల స్ధాయి మారుతుంది. దీనితో స్తనాలకు రక్త సరఫరా అవటం పాలు ఉత్పత్తి కావటం జరుగుతుంది. మూడు లేదా నాలుగు రోజులకల్లా పాలు అధికంగా స్తనాలలో చేరతాయి. మహిళకు మొదట్లో చాలా అసౌకర్యమనిపిస్తుంది. స్తనాలు క్రమేణా పాలు మోయటానికి వాటిని బిడ్డకు అందించటానికి అలవాటు పడతాయి. ఇక అపుడు ఆమెకు సాధారణంగానే వుంటుంది.

Story first published: Thursday, December 15, 2011, 14:52 [IST]
Desktop Bottom Promotion