బేబీ పుట్టిన వెంటనే మహిళలో మార్పులు!

By B N Sharma

What Happens After the Baby is Born?
బేబీ ఒకసారి జననాంగంనుండి బయటకు రాగానే, ప్రసవ ప్రక్రియ పూర్తయినట్లే. అయితే, గర్భాశయంనుండి విడివడటానికి, బొడ్డుతాడు బయటకు రావటానికి మరికొన్ని సంకోచ వ్యాకోచాలు అవసరమవుతాయి. దీని తర్వాత మహిళ గర్భాశయం సైజులో, ఆకారంలో, మార్పులొస్తాయి. మహిళ మానసికంగా ఎంతో రిలీఫ్ భావిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత రక్తం ఆగాలంటే ఈ మార్పు రావాలి.

గర్భాశయంలో నిండుగా రక్తనాళాలు ఇప్పటివరకు ప్లసెంటా ద్వారా బిడ్డకు ఆహారాన్ని అందించినవి వుంటాయి. ఇవి బేబీ బయటకు రాగానే రక్తస్రావం ఆగి మూసుకుపోవాలి. మహిళకు సుమారు ఆరు వారాలవరకు రక్తస్రావం కనపడుతూనే వుంటుంది. బొడ్డుతాడు చివరి ముక్క బయటకు రాగానే ఇక గర్భాశయం కుచించుకుపోవటం గట్టిపడటం మొదలుపెడుతుంది. నర్సులు గర్భాశయ గట్టితనాన్ని మహిళ ఆస్పత్రి నుండి బయటకు వచ్చేముందుగా అనేకమార్లు పరీక్షిస్తారు. గర్భాశయం గట్టిపడింది అంటే రక్తనాళాలు అన్నీ మూసుకుపోయినట్లే భావించాలి.

గర్భాశయం క్రమేణా దాని సాధారణ స్ధితికి చేరుతుంది. దీని సాధారణ సైజు 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు మాత్రమే వుంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మహిళ శరీరంలోని ద్రవాలు త్వరగా ఆగిపోతాయి. ఆమె తరచుగా మూత్రం చేస్తుంది. మొదటి మూత్రం ఆమెకు చాలా నొప్పి అనిపిస్తుంది.

బిడ్డ పుట్టిన తర్వాత, హార్మోన్ల స్ధాయి కూడా క్రమేణా సాధారణ స్ధితికి చేరుతుంది. అప్పటివరకు ఉబ్బెత్తుగా వున్న చర్మం వాపు తగ్గిపోతుంది. బరువుకూడా సాధారణంగా తగ్గుతుంది. ఈ సమయంలో ఆమెకు కేలరీల లిమిట్ పెట్టరాదు. వ్యాయామాలు ఆరు వారాల తర్వాత వైద్యుల సలహాపై చేయవచ్చు.

Story first published: Wednesday, February 29, 2012, 13:11 [IST]
Desktop Bottom Promotion