Latest Updates
-
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే..
రాయలసీమ బిర్యానీ

బాస్మతి బియ్యం : 1/2kg
చికెన్ ముక్కలు : 1kg
గరం మసాలా పౌడర్ : 1/2cup
పాలు : 1/2cup
డాల్డా : 500grm
ఉల్లిపాయలు : 1cup
ఎర్రగా వేయించిన ఉల్లిగడ్డలు : 2cups
వెల్లుల్లి : 1cup
గులాబీ నీరు : 2 tbsp
అల్లం : 4tbsp
ఆయిల్ : 5tbsp
కారం : 3tbsp
ఉప్పు : రుచికి సరిపడినంత
దనియా పొడి : tbsp
కుంకుమ పువ్వు :1tsp
పెరుగు : 2cups
బిరియాని ఆకు : 4
టమేటో :1/2cup
తయారు చేయు విధానం :
1. ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని వాటికి తగినంత ఉప్పు, అరచెంచా కారం, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అరచెంచా పసుపు, పెరుగు అన్నీ కలిపి ఓ గంట పాటు పక్కన పెట్టి నాననివ్వాలి.
2. బాస్మతి బియ్యాన్ని కడిగి ఓ అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీటిని వేడి చేసి అందులో గరం మసాలా పౌడర్ రెండు చెంచాలు వేయాలి. బిర్యాని ఆకు కూడా వేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు చేసి మూడొంతులు బియ్యం ఉడికే వరకు ఉంచాలి. తరువాత నీటిని ఒంపేసి అన్నాన్ని పక్కనపెట్టుకోవాలి.
3. తరువాత నూనెను వేడి చేసి మిగిలిన గరంమసాలా మొత్తం వేసేయాలి. కొద్దిగా వేగనిచ్చి అందులో ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేయించాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి, దనియాల పొడి, పసుపు, కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టమోటా ముక్కలు వేయాలి. వీటిని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందులో చికెన్ ముక్కలు వేసి చికెన్ బాగా ఉడికే వరకు స్టౌ మీద పెట్టాలి.
4. పాలు వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఇప్పుడు పెద్ద పాత్ర తీసుకుని రైస్ ని, చికెన్ ని లేయర్స్ లాగా వేయాలి. మధ్యలో కుంకుమ పువ్వు కలిపిన పాలను వాటిమీద చిలకరించాలి.
5. మిగిలిన గరం మసాలా, పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఈ లేయర్స్ మధ్యలో వేయాలి. మద్యలో డాల్డాను, పైన వేయాలి. అన్ని బాగాల్లో కుంకుమ పువ్వు పాలు కలిసేలా ఉండేట్లు చూడాలి. అలాగే గులాబీ నీటిని కూడా కొద్దిగా చిలకరించాలి.
6. ఇప్పుడు పాత్ర పైభాగాన్ని అల్యూమీనియం పేపర్ తో కవర్ చేయాలి. 20 నిమిషాల పాటు ఆవిరిలో మగ్గనివ్వాలి. అంతే రాయసీమ బిర్యాని రెడీ.



Click it and Unblock the Notifications











