Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
స్పైసీ మటన్ పలావ్... నోరూరించే రైతా

మటన్: 1/2kg
పలావు బియ్యం: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 8-10
జీడిపప్పు: 1cup
నెయ్యి: 2tbsp
కొత్తిమీర: రెండు కట్టలు
లవంగాలు: 6-8
యాలకులు: 4
వెల్లుల్లి పేస్ట్: 2tsp
అల్లం: చిన్న ముక్క
దాల్చిన చెక్క: చిన్న ముక్క
గసగసాలు: 2tbsp
ధనియాలు: 2tbsp
పలావు ఆకులు: 2
మరాటీ మొగ్గ: 4-8
కొబ్బరికాయ: 1
నిమ్మకాయలు: 2
పుదీనా: ఒక కట్ట
ఉప్పు : సరిపడా
పెరుగు: 1/2ltr
తయారు చేయు విధానం:
1. పచ్చి మిర్చి, గసగసాలు, అల్లం, ధనియాలు వీటిని విడివిడిగా మెత్తగా నూరాలి, కొబ్బరి తురిమి పాలు తీసుకోవాలి, ఉల్లిపాయలను నిలువుగా తరిగిపెట్టుకోవాలి.
2. మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెరుగు, రెండు నిమ్మకాయల రసం , తగినంత ఉప్పు, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వాటిలో సగాన్ని వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి పోసి బాగా కాగిన తరువాత అందులో అన్ని కలిపిన మటన్ ను వేసి నీరు అంతా ఇమిరేదాక ఇగర బెట్టాలి.
3 . ఇప్పడు మరొక పెద్ద గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
4 . అందులోనే చెక్క, లవంగాలు, జీడిపప్పు, మరాటీ మొగ్గ, పలావు ఆకు, వేసి కాసేపు వేగనిచ్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంత సేపు వేగాక అందులో అరలీటరు కొబ్బరి పాలు, అర లీటరు నీళ్ళు కొలిచి పోసుకోవాలి.
5 . ఇందులోనే పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మరగనిచ్చి ఎసరు మరిగేటప్పుడు కడిగిపెట్టుకొన్న బియ్యాన్ని కూడా వేయాలి.
6 . అన్నం వుడుకుతుండగా ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ను కూడా అందులో వేసి బాగా కలబెట్టి మూత పెట్టాలి.
7 . తరువాత అది బాగా మగ్గాక పది నిమిషాలు వుంచి దింపేయాలి. దీనికి పెరుగు చట్నీ గాని, కుర్మా గాని మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











