అమృత గుళికలు

Badusha
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1/2kg
పాలు: 1/2 ltr
పంచదార: 1/2kg
యాలకులు: 10
నెయ్యి: 1/2kg
జీడిపప్పు: 20grms
నెయ్యి: 10grms(ప్లేట్ కు రాయడానికి)
తయారు చేయు విధానము:
1. బియ్యం బాగా కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని గ్రైండర్‌ లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
2. స్టౌ మీద గిన్నె పెట్టి పాలు, బియ్యంపిండి కలిపి పోయాలి. ఇది కొంచెం కాగిన తరువాత పంచదార, నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి.
3. పిండి అడుగంటకుండా చూసుకుంటూ, యాలకలు పొడిచేసి అందులోనే వేయాలి. చివరిగా దించబోయే ముందుగా జీడిపప్పు వేసి బాగా తిప్పాలి.
4. ఒక పళ్ళెంలో నెయ్యి రాసి ఈ పిండిని పోయాలి. ఇది వేడిగా ఉండగానే ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టి అలంకరించాలి. అంతే అమృత గుళికలు రెడీ.

Story first published: Friday, September 17, 2010, 13:45 [IST]
Desktop Bottom Promotion