‘నందన’నామ ఉగాది శుభాకాంక్షలతో

Poornam Bobbatlu
సంతోషాలు తీపికి గురుతైతే మనలోని భావాలు పులుపును సూచిస్తాయి మన బాదలు చేదుకి నిర్వచనం పలుకుతాయి. జీవన శైలి మారుతున్న కొద్ది మనము కూడా అట్లే మారాలి అదే ఇప్పటి కాలం లో మార్పంటే . భావోద్వేగాలు వగరును సంకేతమిస్తాయి మన మనస్తత్వాలు ఇవ్వన్నితిని కూడుకొని ఉంది అందుకే ఈ ఉగాది పండక్కి అంత ప్రాధాన్యత. ఉగాదికి రకరకాల పిండివంటలతో అలరించే రుచులు కూడా ....పండగలు అంటేనే స్పెషల్స్, పిండివంటలు తప్పనిసరి.అందులో బాగమే ఈ తియ్య తియ్యని బొబ్బట్లు. వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు.

కావలసిన పదార్ధాలు:
మైదాపిండి: 2cups
ఉప్పు : చిటికెడు
నూనె: 2tsp
పచ్చిశనగపప్పు: 2cups
బెల్లం తురుము: 2cups
పంచదార: 1/4 cup
పచ్చికొబ్బరి తురుము: 1cup
యాలకులపొడి: 1tps

తయారు చేయు విధానం:
1. మొదటగా పచ్చి శెనగపప్పు కొద్ది పలుకుగా, మెత్తగానూ ఉడికించాలి. తర్వాత నీళ్ళు వంపేసి అందులో బెల్లం తురుము, పంచదార, కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు తక్కువ మంట మీద అలాగే మగ్గనివ్వాలి.
2. ఇందులో యాలకులపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.
3. ఈలోగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి కలిపి తగినన్ని నీళ్ళతో చపాతీపిండిలా మృదువుగా కలపాలి. దీన్నిఒక గంట నాననివ్వాలి.
4. ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని కొంచెం వత్తి మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.
5. తర్వాత దీన్ని పలుచని చపాతీలా వత్తి పాన్ మీద రెండువైపులా నేతితో కాల్చాలి. అంతే పచ్చిశెనగపప్పు బొబ్బట్లు రెడీ...

Story first published: Thursday, March 22, 2012, 11:51 [IST]
Desktop Bottom Promotion