Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
‘నందన’నామ ఉగాది శుభాకాంక్షలతో

కావలసిన పదార్ధాలు:
మైదాపిండి: 2cups
ఉప్పు : చిటికెడు
నూనె: 2tsp
పచ్చిశనగపప్పు: 2cups
బెల్లం తురుము: 2cups
పంచదార: 1/4 cup
పచ్చికొబ్బరి తురుము: 1cup
యాలకులపొడి: 1tps
తయారు చేయు విధానం:
1. మొదటగా పచ్చి శెనగపప్పు కొద్ది పలుకుగా, మెత్తగానూ ఉడికించాలి. తర్వాత నీళ్ళు వంపేసి అందులో బెల్లం తురుము, పంచదార, కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు తక్కువ మంట మీద అలాగే మగ్గనివ్వాలి.
2. ఇందులో యాలకులపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.
3. ఈలోగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి కలిపి తగినన్ని నీళ్ళతో చపాతీపిండిలా మృదువుగా కలపాలి. దీన్నిఒక గంట నాననివ్వాలి.
4. ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని కొంచెం వత్తి మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.
5. తర్వాత దీన్ని పలుచని చపాతీలా వత్తి పాన్ మీద రెండువైపులా నేతితో కాల్చాలి. అంతే పచ్చిశెనగపప్పు బొబ్బట్లు రెడీ...



Click it and Unblock the Notifications











