Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
స్పైసీ కర్డ్ రైస్ రిసిపి : టేస్టీ అండ్ హెల్తీ
ఇండియన్ వంటకాల్లో పెరుగన్నం చాలా స్పెషల్ సైడ్ డిష్. సౌత్ సైడ్ వెళ్ళినట్లైతే ప్రతి భోజనానికి పెరుగన్నాన్ని చూడవచ్చు . ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు కడుపును చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతుంది . అంతే కాదు కడుపు నిండేలా చేస్తుంది.
పెరుగన్నాన్ని తయారు చేయడానికి చాలా పద్దతులున్నాయి, అందులో చాలా సింపుల్ గా మరియు అతి సాధారణంగా ఎక్కువగా తయారు చేసే కర్డ్ రైస్ అన్నం, పెరుగు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చితో తయారు చేస్తారు. అయితే ఇందులో మీకు ఇష్టమైన పండ్లు కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. మరి మీకు ఇష్టమైన దానిమ్మ గింజలను ఉపయోగించి పెరుగు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావల్సిన పదార్థాలు:
పెరుగు- 200 ml
అన్నం - 1 cup (ఉడికించినది)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఎండు మిర్చి - 2
ఆవాలు - 1 tsp
ఉల్లిపాయ - 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు - 1 tsp
జీలకర్ర - 1 tsp
కరివేపాకు- 4 -5
ఉప్పు- రుచికి సరిపడా
నీళ్ళు - ½ cup
పండ్లు(అవసరం అయితే) - 1 tbsp(దానిమ్మవిత్తనాలు, ద్రాక్ష)
కొత్తిమీర- కొద్దిగా (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె - 2 tbsp
READ MORE: పెరుగులో దాగి ఉన్న గొప్ప ఆరోగ్య రహస్యాలు
తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో పసుపు, మరియు కొద్దిగా నీళ్ళు పోయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు మంట పూర్తిగా తగ్గించి అందులో పెరుగు వేయాలి.
4. పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
5. తర్వాత ముందుగా వండి పెట్టుకొన్న అన్నం, దానిమ్మ విత్తనాలు, ద్రాక్ష, జీడిపప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











