Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మష్రుమ్ పెప్పర్ రైస్ రిసిపి
సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది మష్రుమ్(పుట్టగొడుల)రుచి, వాసన పట్టదు. అటువంటి వారు ఈ మష్రుమ్ వంటలకు దూరంగా ఉంటారు. కానీ మష్రుమ్ లోని ప్రయోజనాలను తెలుసుకుంటే, వెంటనే తినడం ప్రారంభించేస్తారు. అన్ని గొప్ప ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయి.
మష్రుమ్ క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు మన శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరి మీరు కూడా మష్రుమ్ టేస్ట్ చేయాలన్నా, లేదా మీ ఇంటికి వచ్చిన అథితులకు ఒక కొత్త రుచి చూపించాలన్నా మష్రుమ్ పెప్పర్ రైస్ ట్రై చేయండి. ఈ మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలుం
రైస్ - 1 ½ కప్పులు
పుట్టగొడుగుల - 500 gms
పెప్పర్-2tbsp
ఉల్లిపాయలు - 2tbsp
కారం - 1tbsp
ఆవాలు పౌడర్ - 1 tsp
ధనియాల పొడి - 1 tsp
పచ్చిమిరపకాయలు - 1(సన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
వెన్న - 1tbsp
నూనె - 2tbsp
ఉప్పు- రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పొడిపొడిగా అన్నం వండుకోవాలి. వండుకొన్న తర్వాత అన్నంను ఒక ప్లేట్ తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. వేడి చేసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ రెండు బాగా వేగిన 5 నిముషాల తర్వాత అందులో కారం, ఆవాల పొడి, ధనియాలపొడి, కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
4. మొత్తం వేగిన తర్వాత అందులో మష్రుమ్(పుట్టగొడుగులు) వేసి మీడియం మంట మీద వేగించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత అందులో పెప్పర్ పౌడర్ వేసి వేయించుకవోాలి.
5. మొత్తం మిశ్రమం మరో 5-10నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి మొత్తం మిశ్రమంను కలగలుపుకోవాలి. మొత్తం మిశ్రమం పది నిముషాలు మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. పూర్తిగా వేగించుకొన్న తరవ్ాత అందులో ఉప్పును చిలకరించాలి. అంతే మష్రుమ్ పెప్పర్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications