Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
పండుమిర్చి కొబ్బరి పచ్చడి: టేస్టీ అండ్ స్పైసీ సైడ్ డిష్
సౌత్ ఇండియన్ డిషెష్ లో చట్నీలు చాలా ఫేమస్. తప్పనిసరిగా సైడ్ డిష్ లలో చట్నీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి.
వివిధ రకాల చట్నీలను వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తారు. టమోటో, చింతపండు, కొబ్బరి, కొత్తిమీర, మరియు ఎండుమిర్చి మరియు మరికొన్ని ఇతర పదార్థాలతో చట్నీలను తయారుచేస్తారు. ఈ పదార్థాలను సౌత్ ఇండియన్ చట్నీలన్నింటిలో దాదాపు అన్నింటిలో ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక సింపుల్ పండుమిర్చి కొబ్బరి పచ్చడి ఎలా తయారుచేయాలో తెలపడం జరిగింది. ఈ చట్నీ రిసిపి దోస, ఇడ్లీ, రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్ మరి, ఈ చట్నీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
పండుమిర్చి : 150grm
కొబ్బరితురుము: 1cup
వెల్లుల్లి రేకలు: 10
అల్లం తురుము: 1tsp
ఆవపొడి: 2tbsp
ఎండుమిర్చి: 6
ఆవాలు: 1tbsp
పసుపు: 1tsp
చింతపండు: కొద్దిగా
మెంతిపొడి: 1/4tbsp
నూనె: కొద్దిగా
ధనియాలపొడి: 1tsp
జీలకర్రపొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ఇంగువ: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పండుమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత పాన్ లో3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. చల్లారాక, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
3. అందులోనే కొద్దిగా అల్లం తురుము, చింతపండు జత చేసి మరోసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి.
5. పోపు దోరగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న పండుమిర్చి, కొబ్బరిపేస్ట్ వేసి వేయించాలి .
6. చివరగా ఆవపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. అంతే పండు మిర్చి కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి రైస్ కు సైడ్ డిష్ గా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని దోస, ఇడ్లీలోకి కూడా తినవచ్చు



Click it and Unblock the Notifications