Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ఉడిపి సాంబార్: కర్నాటక స్పెషల్
టెంపుల్ టౌన్ గా పిలువబడే ఉడిపిలో చాలా ఫేమస్ అయినటువంటి రిసిపి ఉడిపి సాంబార్. ఈ పాపులర్ అయినటువంటి రిసిపిని కర్ణాటకాలో చాలా పేమస్ అయినటువంటి టెంపుల్ టౌన్ ఉడిపిలో దీన్ని ఎక్కువగా సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఉడిపి సాంబార్ ఇడ్లీ మరియు దోసలలోకి బెస్ట్ కాంబినేషన్.
ఈ ఉడిపి స్పెషల్ సాంబార్ కు స్పెషల్ సాంబార్ పౌడర్ అవసరం లేదు. ఈ సాంబార్ ను ప్రత్యేకంగా వివిధ రకాలా కూరగాయలను ఉపయోగించి తయారుచేయవచ్చు. అలాగే ఎటువంటి కూరగాయలు లేకున్నా కూడా సాంబార్ ను తయారుచేయవచ్చు.

కావలసిన పదార్థాలు:
కందిపప్పు: 50grsm
బంగాళదుంప ముక్కలు: 1/2cup
క్యారట్ తరుగు: 1/2cup
ఉల్లిపాయతరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
చింతపండు: చిన్న నిమ్మకాయంత (నానబెట్టి రసం తీయాలి)
బెల్లం తురుము: 2tsp
నూనె: 2tbps
పేస్ట్ కోసం:
జీలకర్ర:1/2tsp
మినప్పప్పు: 1tsp
ఎండుమిర్చి: 4
పచ్చి శనగపప్పు: 2tsp
ధనియాలు: 2tbsp
మిరియాలు: 6
కొబ్బరితురుము: 1/2cup
పోపు కోసం:
ఆవాలు: 1/2tsp
మినప్పప్పు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు
పచ్చిమిర్చి: 3
కొత్తిమీర: చిన్నకట్ట
తయారు చేయు విధానం:
1. కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుక్కర్ లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి ఒక గిన్నెలో బంగాళదుంప, క్యారట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తగినంత నీరు పోసి ఉడికించాలి.
2. తర్వాత పాన్ లో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పడు చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి. ఉడికించి మెత్తగా చేసుకున్న కందిపప్పు, కూరగాయల ముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము వేసి కలపాలి తగినంత నీరు జత చేసి, మంట తగ్గించి 15 నిముషాలు ఉంచి దించేయాలి.
4. పాన్లో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక అందులో ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించి, సాంబార్లో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
అంతే ఉడిపి సాంబార్ రెడీ.



Click it and Unblock the Notifications