Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
Raksha bandhan 2021:రాఖీ పండుగ రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రక్షా బంధన్ రోజున ఈ పరిహారాలు పాటించండి.. శుభ ఫలితాలను పొందండి.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవంత్సరం శ్రావణ మాసంలో జులై లేదా ఆగస్టు మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. 2021 సంవత్సరంలో ఆగస్టు 22వ తేదీన ఆదివారం నాడు ఈ పండుగ వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్క సోదరునికి తమ సోదరీమణి రాఖీ కడతారు. తమకు అనునిత్యం అండగా ఉండమని కోరతారు. అదే సందర్భంలో ఏదైనా బహుమతిని ఇచ్చే సోదరుడు దాని రూపంలో తాము రక్షణగా ఉంటామని హామీ ఇస్తారు.

ఇదిలా ఉండగా.. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి లక్ష్మీదేవికి సంబంధించినది. కాబట్టి ఈరోజున కొన్ని పరిహారాలు పాటిస్తే కచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సందర్భంగా అవేంటో చూసేద్దాం రండి...

మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు..
రాఖీ పౌర్ణమి పండుగ రోజున అంటే శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున మహా విష్ణువుకు సంబంధించిన లక్ష్మీ నారాయణుడికి ప్రత్యేక పూజలు చేస్తే.. మీకు సంపద, ఆరోగ్యం సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా కనకధార స్తోత్రం, విష్ణుసహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ పూజల ఫలితంగా మీ ఇంట్లో సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

నవగ్రహాలకు శాంతి..
రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు చంద్రుడితో పాటు నవగ్రహాలకు శాంతి పూజ చేయించాలి. గ్రహాలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతికూల గ్రహాల శుభ ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ సులభంగా విజయం సాధిస్తారు. మీరు ప్రతి ప్రయత్నంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు.

ప్రేమానురాగాలు పెరుగుతాయి..
రాఖీ పండుగ రోజున మీరు బాల క్రిష్ణుడికి, మీ కులదేవతలకు రక్షా సూత్రాన్ని కడితే.. మీ కుటుంబంలో ఆనందం, శాంతి శ్రేయస్సు వెల్లి విరుస్తాయి. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మరింత పెరుగుతాయి. దీంతో పాటు మీ ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మీ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను సైతం సులభంగా అధిగమిస్తారు.

అమ్మనాన్నల ఆశీర్వాదం..
రక్షా బంధన్ పండుగ రోజున అమ్మనాన్నల ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి. అనంతరం సోదరుల, సోదరీమణులు, ఉపాధ్యాయుల ఆశీర్వాదాన్ని తీసుకుంటే మీరు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీకు సమాజంలో గౌరవం, కీర్తి, జ్ణానం లభిస్తుంది. మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీరు ప్రతి విషయంలోనూ అసాధారణమైన పని చేసే శక్తిని పొందుతారు.

మీరు వాడే వాహనాలకు
రాఖీ పౌర్ణమి పండుగ రోజున మీరు వాడే వాహనాలన్నింటికీ రక్షా సూత్రాన్ని కట్టండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా భద్రత పొందుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మీకు మార్గం మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవని.. అందుకే రాఖీ పండుగ రోజున రక్షా సూత్రాన్ని కడితే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

పేదలకు దానం..
రక్షా బంధన్ పండుగ రోజున అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు రాఖీ కట్టుకున్న అనంతరం, మీ సామర్థ్యం మేరకు పేదలకు, అవసరమైన వారికి ఆహారం లేదా ధనాన్ని దానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఇలాంటి పని చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. అలాగే మీరు చనిపోయిన తర్వాత మీకు మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజున మీరు ఆహారం లేదా ధనాన్ని దానం చేయడం వల్ల మీరు మరింత ధనవంతులవుతారని శాస్త్రాల్లో పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications











