అన్ని మతాల ప్రజలను అలరించే క్రిస్టమస్ పండుగ

By Staff

Santa Clause
భారత దేశంలో ఇతర మతపర పండుగలతో పోలిస్తే క్రిస్టమస్ పండుగను జరుపుకునే జనాభా శాతం చాలా తక్కువ. భారతదేశ జనాభా 1 బిలియన్ పైగా వుందనుకుంటే, వీరిలో క్రిస్టియన్లు 25 మిలియన్లవరకు వుండవచ్చని గణాంకాలు తెలుపుతున్నాయి. భారతదేశ నగరాలలో అత్యధిక క్రిస్టియన్ జనాభా ముంబై నగరంలో వున్నారు. వీరంతా రోమన్ కేధలిక్స్. ఇండియాలోని క్రిస్టియన్లకు మిడ్ నైట్ మాస్ చాలా ప్రాధాన్యతతో కూడిన సేవగా కేధలిక్స్ భావిస్తారు.

అర్ధరాత్రి మాస్ కు క్రిస్టియన్ మతస్తులు వారి కుటుంబ సభ్యులతో కలసి పాల్గొంటారు. మాస్ తర్వాత వివిధ రకాల రుచులు కల పదార్ధాలతో బ్రహ్మాండమైన విందు చేసుకుంటారు. బహుమతులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. చర్చీలన్ని రంగురంగుల పూలతో, కొవ్వోత్తుల దీపాలతో అర్ధరాత్రి మాస్ లో కన్నుల పండువగా అలంకరిస్తారు. ఒకరికొకరు 'హేపీ క్రిస్టమస్' అంటూ వారి వారి భాషలలో అభినందించుకుంటారు. సాంప్రదాయమైన క్రిస్టమస్ ట్రీలకు బదులుగా, అరటి లేదా మామిడి చెట్లు కూడా అలంకరిస్తారు. కొంతమంది వారి ఇండ్లకు మామిడి ఆకులు కూడా కడతారు.

దక్షిణ భారత దేశంలో, క్రిస్టియన్లు జీసస్ ప్రపంచానికి వెలుగు చూపాడని చెపుతూ నూనెతో కూడిన దీపాలను కూడా తమ ఇండ్ల బయట వెలిగిస్తారు.కొంతమంది క్రిస్టియన్లు తమ ఇండ్లముందు, ఎండు గడ్డి వంటివి కూడా వుంచి అందులో మతపర అలంకరణలు చేస్తారు. లైటు వెలిగే నక్షత్రాలను రంగు పేపర్లతో తయారు చేసి ఇంటి ముంగిట వేలాడదీస్తారు. వచ్చిన అతిధులకు ప్రతి ఇంటిలోను స్వీట్లు తినిపిస్తారు.

కొన్ని ప్రాంతాలలో కొంతమంది క్రిస్టియన్ ప్రజలు రాత్రంతా పాటలు పాడుతూ, భజనలు చేస్తూ గడుపుతారు. సమీప గ్రామాలకు వెళ్ళి పండుగ ప్రాముఖ్యతను కధలరూపంలో వివరిస్తారు. క్రిస్టమస్ పండుగనాడు శాంతా క్లాజ్ పిల్లలకు తన గుర్రపు బండిలో వచ్చి బహుమతులు ఇస్తాడు. ఆయనను పిల్లలు ముద్దుగా తమ భాషలలో క్రిస్టమస్ బాబా అని పిలుస్తారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion