Latest Updates
-
సౌభాగ్య యోగం: ఈరోజు ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. ధనలాభం పక్కా! -
రక్తహీనతకు చెక్, కండరాలకు బలం..ఐరన్,ప్రొటీన్ అధికంగా ఉండే పెసరపప్పు పాలకూర ఇడ్లీ.. -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం కనిపించట్లేదా? ఈ 5 తప్పులు కారణమై ఉండొచ్చు! -
కంప్యూటర్ లా మీ మెదడు పనిచేయాలంటే..తినాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
జూన్ 10న గురు గ్రహ ఉచ్ఛస్థితి: ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథున, కన్య, మకర రాశుల వారికి బుధుడి అనుగ్రహం.. భారీ లాభాలు! - బుధవారం, 10 జూన్ 2026 -
జూన్ 21నే యోగా దినోత్సవం ఎందుకు జరుపుకొంటారో తెలుసా.? -
శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు? ఈ భయానక రహస్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక -
హెల్తీగా బరువు తగ్గి, రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. కొర్రలతో ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే.! -
ఏ భర్తా భార్యతో అనకూడని ఒకే ఒక మాట.. లేదంటే విడాకులే దారి.!
బేబీలు బరువు సంతరించుకోవాలంటే!

చాలా మంది తక్కువ ఎత్తుతో తక్కువ బరువుతో చిన్నతనంలో వుంటారు. అటువంటి పిల్లలకు పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స చేయాలి. ఆహార లేమిని అరికట్టాలి. అట్లే శారీరకంగా ధైరాయిడ్ లోపం వంటివి వున్నాయా? అనేది పరీక్షించాలి. దీనికిగాను వైద్యులు, కుటుంబ సభ్యులు కలసి పనిచేయాలి. బిడ్డను మరోమారు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సిద్ధం చేయాలి. ఖచ్చితమైన వ్యాధి లేకుండానే బిడ్డల ఎదుగుదల విఫలమవుతోందని సుమారు ఒక శతాబ్దంగా పోషకాహార నిపుణులు గుర్తిస్తున్నారు. ఈ రకంగా ఎదుగుదల లోపించిన పిల్లలు ఆశించిన రీతిలో బరువు పొందటానికి తగిన కేలరీలు లోపలికి తీసుకోలేరు. తీసుకున్నా వాటిని ఖర్చు చేయలేరు.
శిశువులలోను, బేబీలలోను చేసిన అనేక ఆరోగ్య పరీక్షలు మొదటి సంవత్సరాలలోనే వారికి ఈ విధమైన పరిస్ధితి ఏర్పడుతోందని ఇదే సమయంలో వారి శారీరక, మానసిక అభివృధ్ధి చోటు చేసుకుంటుండటంతో అది కుంటుపడుతోందని తెలుపుతున్నాయి. పుట్టిన తర్వాత ఒక బిడ్డ బ్రెయిన్ మొదటి సంవత్సరంలో ఎంత ఎదుగుదల చూపుతుందో అతని మిగిలిన జీవితంలో కూడా అంతే ఎదుగుదల చూపుతుంది. ఈ వయసులో వుండే పోషకాహారలేమి వారి మానసిక అభివృద్ధిపై శాశ్వతంగా వ్యతిరేక ప్రభావం చూపుతోంది.
చాలామంది పిల్లలు తమ మొదటి నాలుగు నెలల వయసులో రెండు రెట్లు బరువు పెరుగుతారు. ఒక సంవత్సరం వచ్చే సరికి మూడు రెట్లు కూడా పెరుగుతారు. కాని బరువు పెరగలేని పిల్లలు దీనిలో విఫలమవుతారు. ఒక్కొక్క సారి పిల్లలు బరువు ఎక్కడం మొదలు పెట్టి అతి త్వరలోనే తమ బరువు కోల్పోతుంటారు. కొంతకాలం గడిచే సరికి వారి ఎత్తు ఎదగడం కూడా నెమ్మదైపోతుంది. పరిస్ధితి మెరుగుపడుతూంటే, పోషకాహారలేమి కల పిల్లలు, వారి చుట్టుపక్కల పరిస్ధితిపై ఆసక్తి ప్రదర్శించలేరు. ఏ ఒక్కరిపైనా ఏకాగ్రత పెట్టలేరు. చికాకు, కోపం అధికమవుతాయి. వయసుకి తగిన ప్రవర్తన వారిలో ఏర్పడదు.
కనుక పిల్లలకు ప్రారంభ వయసులోనే తల్లితండ్రులు వారి వయసుకు తగిన పోషకాహారం ఇవ్వాలి. వారి సమస్యలను తగిన రీతిలో తగిన వైద్య విధానాలతో పరిష్కరించి వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి కృషి చేయాలి.



Click it and Unblock the Notifications