Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
నోరూరించే ధమ్ బిర్యాని

మాంసం - 1 kg
బాస్మతి బియ్యం - 1 kg
ఉల్లిపాయలు -1/4 kg
పెరుగు - 1 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 tsp
కొత్తిమిర - 1/2 cup
పుదీన - 1/2 cup
పచ్చిమిర్చి - 3
పసుపు - 1/4 tsp
కారం - 1 tsp
ఏలకలు - 6
లవంగాలు - 10
దాల్చిన చెక్క - 2 ముక్కలు
షాజిర - 2 tsp
గరం మసాలా - 1 tsp
కేసర్ రంగు - 1/2 tsp
పాలు - 1/2 cup
ఉప్పు - రుచికి సరిపడ
నూనె - 2 కప్పులు
తయారు చేయు విధానము
1. ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా వేయించి పెట్టుకోవాలి.
2. తరిగిన కొత్తిమిర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి పెట్టకోవాలి. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. నిమ్మరసం, ఎండిన గులిబి రేకులు, మాంసానికి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, గ్రైడ్ చేసిన పేస్ట్, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిర్చి, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం ఒక గంట నాననివ్వాలి.
5. బియ్యం నీటిలో కడిగి ఒక అర గంట నాననివ్వాలి. మందపాటి గిన్నె తీసుకొని కొద్దిగా నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకొవాలి.
6. మరొక గిన్నెలో (బియ్యానికి మూడింతలు) నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకలు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయాలి.
7. బియ్యంలోని నీరంగా వడకట్టాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే త్వరత్వరగా జల్లెడలో వడకట్టి మాంసంపై సమానంగా పరవాలి.
8. తర్వాత ఆ అన్నం పైన ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, యాలకుల పొడి, రెండు చెంచాలా నెయ్యి, పాలు, కేసరి రంగు, వేసి తడిపిన గోధుమ పిండిని లేదా శుభ్రమైన తడి గుడ్డను చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. బిర్యానీ మొత్తం ఆవిరి మీదే ఉడికిపోతుంది. అంతే ఘుమఘుమలతో దమ్ బిర్యాని రెడీ. దీనికి కాంబినేషన్ పెరుగుపచ్చడి, బగారా బైగన్.



Click it and Unblock the Notifications