Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఖీమా పకోడ: రంజాన్ స్పెషల్ స్నాక్
రంజాన్ నెల ప్రారంభమైందంటే చాలు,సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్షలు చేస్తారు ముస్లీములు. సూర్యస్తమయంలో ఉపవాసం బ్రేక్ చేసే సమయంలో అద్భుతమైన రుచులు కోరుకుంటారు . రోజంతా ఉపవాసం ఉండే వారు, మీ మనస్సులో మొదట వచ్చేదేమి. మీరు ఖచ్చితంగా బిర్యానీ మీద కాదు.
మీరు నిజంగా ఒక క్రంచీ కబాబ్ లేదా యమ్నీ స్నాక్స్ నుతినడానికి ఇష్టపడుతారు. రంజాన్ రిసిపిలలో ఒక ఉత్తమ వంటలు ఎప్పుడూ ఫ్రైడ్ లేదా స్పైసీ వంటలే. మీరు రోజంతా ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు, ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోవాలి.
పకోడాలు తయారుచేయడం చాలా సులభం మరియు ఇంట్లో మిన్స్ చేసిన మాంసం ఉన్నప్పుడు , దానికి కేవలం కొన్ని బేసిక్ మాసాల దినుసులు, స్పైసీలను జోడించి తయారుచేయడమే . మరి ఈ క్విక్ రంజాన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
ఖీమా(మటన్): 2cups(500grms)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగినవి)
శెనగపిండి: 1cup
టమోటో: 1(సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
గరం మసాలా: 1tsp
కబాబ్ మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2cups

తయారుచేయు విధానం:
1. ముందుగా ఖీమా , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టమోట ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి.
2. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లిపేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
3. అలాగే ఉప్పు, కీమా మసాలా, మరియు గరం మసాలా కూడా ఖీమామిశ్రమంలో వేయాలి . మొత్తం అన్ని కలగలిసేలా మిక్స్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ఖీమా మిశ్రమంలో శెనపిండి జోడించి, అరకప్పు నీళ్ళు పోసి కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు మీ చేత్తోనే కొద్దికొద్దిగా ఖీమా మిశ్రమపిండిని చేతిలోకి తీసుకొని పకోడాల్లా చేసి పక్కన పెట్టుకోవాలి.
6. అంతలోపు, డీప్ బాటమ్ పాన్ స్టౌ మీద పెట్టి, నూనె పోసి వేడయ్యా అందులో ఖీమా పకోడాలు వేయాలి.
7. మంటను పూర్తిగా తగ్గించి, మూత పెట్టి అన్నివైపులా కాలే విధంగా 10నిముషాలు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఖీమా పకోడాలు రెడీ . ఈ పకోడాలను సర్వింగ్ ప్లేట్ లో అమర్చి, ఉల్లిపాయ రింగ్స్, మరియు పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











