మటన్ ఖీమా విత్ ‘పక్కి పలావ్’

Mutton keema
కావలసిన పదార్థాలు :

బాస్మతి బియ్యం - 1/2 kg
మటన్ ఖీమా - 1/4 kg
ఉల్లిపాయలు- 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 tsp
కారం - 1 tsp
జీలకర్ర - 1/2 tsp
పెరుగు - 1 cup
టొమోటోలు.- 4
గరంమసాలా - 1/2 tsp
నిమ్మకాయ రసం -2 tsp
పచ్చిబఠాణీ - 1/2 cup
పుదీనా - 1/2 cup
కొత్తిమీర - 1/2 cup
డాల్డా -50 grm
ఉప్పు - రుచికితగినంత
నూనె - తగినంత

తయారు చేయు విధానం :

1. ఖీమాలో తగినన్ని నీళ్లుపోసి ఇమిరిపోయేదాకా ఉడికించాలి.
2. పాన్‌లో నూనె వేసి కాగాక సన్నగ తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి. తర్వత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి వేయించాక ఖీమా, టొమోటో ముక్కలు వేసి బాగా ఉడికించి కూరలా తయారు చేయాలి.
3. ఇప్పుడు పెరుగు, గరంమసాలా, ఉప్పు, కారం కూడా జత చేసి ఉడికించి దించేయాలి.
4. వేరే గిన్నెలో ఎసరుపోసి అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కడిగిన బియ్యంపోసి మూడువంతులు ఉడికించి వార్చాలి.
5. మరొక గిన్నెలో అడుగున డాల్డా వేసి సగం అన్నం వేసి పరచినట్లు చేయాలి. తరువాత దానిపై ఖీమా కూర, విడిగా ఉడికించి పెట్టుకున్న బఠాణీలను వేసి ఆపై మిగిలిన అన్నం, మిగిలిన ఖీమా కూరను వేయాలి.
6. ఫైనల్ గా అన్నంపైన నిమ్మరసం, కొత్తిమీర పుదీనాలను చల్లాలి. మిగిలిన డాల్డాను కూడా అన్నంపైన చల్లి సిమ్‌లో పెట్టి దమ్ చేస్తే పూర్తిగా ఉడికితే అదే మటన్ ఖీమా విత్ 'పక్కి పలావ్" రెడీ. ఉల్లిపాయలు, టమోటోలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Story first published: Wednesday, November 25, 2009, 17:59 [IST]
Desktop Bottom Promotion