Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
రంజాన్ స్పెషల్: కాశ్మీర్ మిర్చి కుర్మా రిసిపి
కాశ్మీర్ కుషన్స్ లో మిర్చి కుర్మా స్పైసీ మరియు టేస్టీ కుషన్. ఇది ఒక స్పెషల్ డిష్ . అందుకే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను అందిస్తుంది. రెడ్ చిల్లీ డిఫరెంట్ టేస్ట్ మరియు కలర్ కలిగి నోరూరిస్తుంటుంది.
కాశ్మిర్ మిర్చి స్టొమక్ అప్ సెట్ మరియు అజీర్ణంకు దారితీస్తుంది, కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. అయితే ఈ రెండ్ చిల్లీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హార్ట్ ను హెల్తీగా ఉంచతుంది మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మరి ఈ కాశ్మీరి డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
ఎండు మిర్చి(విత్తనాలు తీసేసినవి): 10
ఉల్లిపాయలు: 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
జీలకర్ర: 1tsp
మీట్ మసాల: 1tbsp
సోంపు పొడి: 1tbsp
చింతపండు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
మాంసం: 1Kg
నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులోనే మటన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, సోంపు పొడి, జీలకర్ర మరియు మీట్ మసాల పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి 15నిముషాల పాటు ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రెజర్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత ఒక సపరేట్ బౌల్లో ఎండుమిర్చి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తబడేవరకూ ఉడికించాలి.
6. తర్వాత నీరు వంపేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
7. ఇప్పుడు మటన్ మిశ్రమంలో చింతపండు పేస్ట్ మరియు చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రంజాన్ స్పెషల్ డిష్ ను రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications