Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రంజాన్ స్పెషల్: కాశ్మీర్ మిర్చి కుర్మా రిసిపి
కాశ్మీర్ కుషన్స్ లో మిర్చి కుర్మా స్పైసీ మరియు టేస్టీ కుషన్. ఇది ఒక స్పెషల్ డిష్ . అందుకే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను అందిస్తుంది. రెడ్ చిల్లీ డిఫరెంట్ టేస్ట్ మరియు కలర్ కలిగి నోరూరిస్తుంటుంది.
కాశ్మిర్ మిర్చి స్టొమక్ అప్ సెట్ మరియు అజీర్ణంకు దారితీస్తుంది, కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. అయితే ఈ రెండ్ చిల్లీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హార్ట్ ను హెల్తీగా ఉంచతుంది మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మరి ఈ కాశ్మీరి డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
ఎండు మిర్చి(విత్తనాలు తీసేసినవి): 10
ఉల్లిపాయలు: 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
జీలకర్ర: 1tsp
మీట్ మసాల: 1tbsp
సోంపు పొడి: 1tbsp
చింతపండు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
మాంసం: 1Kg
నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులోనే మటన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, సోంపు పొడి, జీలకర్ర మరియు మీట్ మసాల పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి 15నిముషాల పాటు ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రెజర్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత ఒక సపరేట్ బౌల్లో ఎండుమిర్చి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తబడేవరకూ ఉడికించాలి.
6. తర్వాత నీరు వంపేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
7. ఇప్పుడు మటన్ మిశ్రమంలో చింతపండు పేస్ట్ మరియు చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రంజాన్ స్పెషల్ డిష్ ను రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications











