Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
ఖీమా పకోడ: రంజాన్ స్పెషల్ స్నాక్
రంజాన్ అంటే ఆ నెల మొత్తం ముస్లీములు ఉపవాస దీక్షలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండే వీరికి సాయంత్రం ఉపవాసం తీర్చుకొనే సమయం. అందుకోసం వివిధ రకాల అద్భుతమైన వంటలు, ప్రతి ముస్లిం ఇంట్లోనూ అలరిస్తుంటాయి. అటువంటి స్పెషల్ డిష్ లలో కబాబ్ రిసిపిలు మరియు పకోడాలు కూడా ఒకటి.
కబాబ్ రిసిపిలనే కొంచెం వెరైటీగా శెనపిండి చేర్చి పకోడాల కూడా తయారుచేస్తారు . ఈ పకోడ రిసిపిలను టేస్ట్ చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఉంటారు. రంజాన్ సీజన్ మొత్తం ప్రతిఒక్కరి ముస్లీం ఇంట్లోనో ఖీమాతో తయారుచేసే పకోడాలు తప్పకుండా చేస్తారు. అంటువంటి వంటలో మటన్ ఖీమా రిసిపి కూడా ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేస్తారో చూద్దాం...

కావల్సిన పదార్థాలు :
ఖీమా (మటన్): 2 cups(500 గ్రాముల)
ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4 (చిన్న ముక్కలుగా తరిగినవి)
శనగ పిండి: 1cup
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
గరం మసాలా: 1tsp
కబాబ్ మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2cups
తయారుచేయు విధానం:
1. ముందుగా ఖీమా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టమోటోలు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేయాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి .
3. తర్వాత అందులోనే ఉప్పు, కబాబ్ మసాలా మరియు గరం మసాలా కూడా వేసి బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమంలో శెనగపిండి, అరకప్పు నీళ్ళు పోసి పిండిని చిక్కగా కలుపుకోవాలి.
5. తర్వాత చేత్తో కొద్దికొద్దిగా తీసుకొని చిన్న పకోడాలుగా చేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి.
6. అంతలోపు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి, నూనె కాగిన తర్వాత అందులో పకోడాలను వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
7. మంట తగ్గించి, మూత పెట్టి, అన్ని ఫైపులా ఫ్రై అయ్యే విధంగా 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే ఖీమా పకోడ రెడీ. వీటిని ఆనియన్ రింగ్స్ తో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications