Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బొచ్చె చేపల కుర్మా అమోఘం....

కావలసిన పదార్థాలు:
బొచ్చె చేప ముక్కలు: 1/2kg
అల్లంవెల్లుల్లి పేస్ట్: 3tbsp
ఉల్లిపాయ: 2
టమాటా ముక్కలు: 1/2cup
పచ్చిమిర్చి: 6-8
కరివేపాకు రెబ్బలు: 2
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
ధనియా పౌడర్: 1tsp
జీలకర్ర: 1tsp
మెంతిపొడి: 1/2tsp
కారం: 4tsp
గరంమసాలా: 1tsp
చింతపండురసం: 3tsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానము:
1. చేపముక్కలకు ఉప్పు, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద పట్టించి అరగంట నాననివ్వాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి చేపముక్కల్ని వేయించాలి.
2. మరో పాన్ లో మిగిలిన నూనె వేడి చేసి ఉల్లిపాయముక్కలు వేయించి మిగిలిన అల్లం వెల్లుల్లిముద్ద, మరికాస్త ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర చేర్చాలి.
3. తర్వాత సన్నగా తరిగిన టమాటాముక్కలు వేసి మొత్తగా అయ్యేదాకా వేయించాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసి అవి మరుగుతుండగా కరివేపాకు, గాటుపెట్టిన పచ్చిమిర్చి వేయాలి.
4. ఇప్పుడు అందులో చింతపండు రసం వేయాలి. ఈ గ్రేవీ మరుగుతున్నప్పుడు వేయించిపెట్టుకున్న చేపముక్కల్ని వేసి కొద్దిగా మెంతిపొడి చల్లాలి. ముక్కలు ఉడికి దగ్గరయ్యాక మసాలపొడి, కొత్తిమీర చల్లిదింపేస్తే సరి. అంతే వేడివేడి చేపలకుర్మా రెడీ.



Click it and Unblock the Notifications