సేమ్యా-పచ్చిరొయ్యల బిర్యానీ

Biryani with Prawns
కావలసిన పదార్థాలు:
పచ్చిరొయ్యలు: 1/2kg
సేమ్యా: 1/2kg
నెయ్యి: 200grms
జీడిపప్పు: 100grms
లవంగాలు, ఏలకులు: 6:6
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఉల్లికాడ తరుగు: 2tsp
పెరుగు: 11/2cup
ఉల్లిపాయలు: 3 పెద్దవి
పచ్చిమిర్చి తరుగు: 2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
నిమ్మరసం: 2tsp
ఉప్పు, కారం, పసుపు: కావలసినంత
కొత్తిమీర, పుదీనా: 1cup

తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి మరిగాక అందులో సేమ్యా వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ స్టౌమీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అందులో ఉల్లి తరుగు, జీడిపప్పు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ల్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు నిమిషాలువేయించాలి.
4. ఇప్పుడు పచ్చిరొయ్యలు, పెరుగు, ఉప్ప, పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలిపి ఉడుకుతుండగా సేమ్మావేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికిన తర్వాత నిమ్మరసం వేసి కలిపి దించేయాలి.
5. చివరగా కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. అంతే రొయ్యలు సేమ్యా బిర్యానీ రెడీ.

Story first published: Monday, February 6, 2012, 18:04 [IST]
Desktop Bottom Promotion