బొజ్జగణపయ్య మెచ్చిన ఉండ్రాళ్లు

By Nageswara Rao

Undrallu
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1cup
శెనగపప్పు నానబెట్టుకున్నవి: 2tbsp
జిలకర: 1/2tbsp
తురిమిన కొబ్బరి: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 2cup

తయారు చేయు విధానం:
1. బియ్యాన్ని కడిగి నీళ్లు వంపుకోవాలి. తరువాత వాటిని ఒక పేపరు మీద ఆరబెట్టాలి. బాగా పొడిగా ఆరా లంటే కనీసం గంట సేపు అలాగే వుంచాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా వుండేలా చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో నీటిని బాగా కాగనివ్వాలి. మరుగుతున్న నీటిలో నానబెట్టుకున్న శెనగపప్పు, జిలకర్ర వేసుకుని సన్నని మంట పై మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో బియ్యం రవ్వను ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి.
3. ఇప్పుడు కావసినంత ఉప్పు వేసి, మొత్తం నీళ్ళు ఇగిరిపోయే వరకు సన్నని మంట పై ఉడకనివ్వాలి. కొబ్బరి తురుమును కూడా ఇందులోనే వేసుకోవాలి. బాగా ఉడికిన తరువాత స్టౌ ఆపివేసి పిండిని దించుకోవాలి.
4. ఆవిరి బయటికి వెళ్ళకుండా పాత్ర పై మూత పెట్టాలి. 15 నిమిషాల తరువాత మూతతీసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
5. రవ్వ గనుక బిగుసుకుపోయినట్లు అయితే కొద్దిగా నీళ్ళు చల్లుకుని వుండలుగా చేసుకోవాలి. ఇడ్లీ ప్లేటులో రవ్వ వుండలను పెట్టి ఆవిరిపై ఉడి కించాలి. పది నుండి పది హేను నిమిషాలు ఆవిరి పై ఉడికించాలి. అంతే బొజ్జగణపయ్యకు నచ్చిన ఉండ్రాళ్లు రెడీ..

Story first published: Wednesday, September 8, 2010, 15:33 [IST]
Desktop Bottom Promotion