మసాలా పల్లీలు

Masala Pallilu
కావలసిన పదార్దాలు:
వేరుశనగలు: 2 cups
శెనగపిండి: 1 cup
బియ్యంపిండి: 3 tbsp
కారం: 2 tsp
గరంమసాలా: 2 tsp
పచ్చిమిర్చి: 4
వెల్లుల్లి రెబ్బలు: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
చాట్ మసాలా: 1 tsp
ఆమ్ చూర్ పొడి: 1/2 tsp
పసుపు: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: తగినంత

తయారు చేయు విధానము:
1. వేరుశెనగపప్పు, చాట్ మసాలా మినహా మిగిలిన పదార్ధాలన్నింటినీ ఓ పాత్రలో తీసుకుని గట్టి పిండిలా కలపాలి.
2. పదిహేను నిమిషాలయ్యాక ఈ మిశ్రమానికి వేరుశెనగపప్పు చేర్చి పక్కన పెట్టుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకొన్న పిండిని పకోడిల్లా వేసి వేయించాలి.
4. వీటన్నింటిని ఒక ప్లేటులోనికి తీసుకొని పైన చాట్ మసాలా చల్లాలి. అంతే కరకరలాడే మసాలా పల్లీలు రెడీ.

Story first published: Wednesday, March 31, 2010, 12:19 [IST]
Desktop Bottom Promotion