Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వింటర్ స్పెషల్ - మట్టర్ పన్నీర్ సమోసా

కావలసిన పదార్థాలు:
మైదా: 1/2kg
డాల్డా లేదా నెయ్యి: 50grms
ఉప్పు: చిటికెడు
పనీర్ తురుము: 2cups
పచ్చిబఠాణీలు లేదా నానబెట్టిన బఠాణీలు: 1cup
పచ్చిమిర్చి: 6-8
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1/2tsp
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాను జల్లించి ఒక మిక్సింగ్ బౌల్ వేసి అందులో చిటికెడు ఉప్పు, డాల్డా వేసి బాగా కలపాలి, తర్వాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి.
3. అలాగే బఠాణీలకు కూడా వేసి తడిపోయే వరకూ వేయించాక, పన్నీర్ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదాలో నుంచి కొంత బాగం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి.
5. ఇలా వత్తుకొన్న తర్వాత చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్ లా మడిచి చెంచా నిండుగా ఫ్రై చేసుకొన్న పనీర్ మిశ్రమాన్నిపెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అంతే మట్టర్ పన్నీర్ సమోసా రెడీ..



Click it and Unblock the Notifications











