Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వింటర్ స్పెషల్ - మట్టర్ పన్నీర్ సమోసా

కావలసిన పదార్థాలు:
మైదా: 1/2kg
డాల్డా లేదా నెయ్యి: 50grms
ఉప్పు: చిటికెడు
పనీర్ తురుము: 2cups
పచ్చిబఠాణీలు లేదా నానబెట్టిన బఠాణీలు: 1cup
పచ్చిమిర్చి: 6-8
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1/2tsp
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాను జల్లించి ఒక మిక్సింగ్ బౌల్ వేసి అందులో చిటికెడు ఉప్పు, డాల్డా వేసి బాగా కలపాలి, తర్వాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి.
3. అలాగే బఠాణీలకు కూడా వేసి తడిపోయే వరకూ వేయించాక, పన్నీర్ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి మరో ఐదు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదాలో నుంచి కొంత బాగం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి.
5. ఇలా వత్తుకొన్న తర్వాత చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్ లా మడిచి చెంచా నిండుగా ఫ్రై చేసుకొన్న పనీర్ మిశ్రమాన్నిపెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అంతే మట్టర్ పన్నీర్ సమోసా రెడీ..



Click it and Unblock the Notifications