Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
నవరాత్రి స్పెషల్-బాదూషా తయారీ విధానం (వీడియోతో)
నవరాత్రులంటే మనందరికీ ఇష్టమే, ఈపాటికే ఏర్పాట్లు మొదలయిపోయుంటాయి కదా.నవరాత్రుల ఏర్పాట్లంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుర్గా మాత విగ్రహాల తయారీ మాత్రమే కాదు, రక రకాల పిండివంటల తయారీ కూడా.అందుకే సులభంగా మీరు ఈ నవరాత్రుల్లో తయారు చేసుకోవడానికి బాదూషా తయారీ ఇచ్చాము.బాదూషా తయారీ అంటే చాలా కష్టమని మనలో చాలామంది భావిస్తారు, కానీ చాలా సులభం తెలుసా??
క్రింద మేము ఇచ్చిన వీడియో లో బాదూషా ఎలా చెయ్యాలో వివరంగా వివరించబడింది.ఇంక ఆలశ్యమెందుకు, నోరూరించే బాదూషా చేసేయ్యండి మరి.
బాదూషా తయారీకి ముందు అన్నీ సిద్ధం చేసుకోవడానికి పట్టే సమయం:20 నిమిషాలు
బాదూషా తయారీకి పట్టే సమయం:30 నిమిషాలు
ఎంత మందికి సరిపోతుంది:4
కావాల్సిన పదార్ధాలు:
- మైదా-ఒక కప్పు
- నెయ్యి-రెండు టీస్పూన్లు
- బేకింగ్ సోడా-చిటికెడు
- పెరుగు/యోగర్ట్-అర కప్పు
- పంచదార- ఒక కప్పు
- నీళ్ళు-ఒక కప్పు
- ఏలకుల పొడి-చిటికెడు
- నూనె-వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
1.ఒక బౌల్ తీసుకుని దానిలో పెరుగు/యోగర్ట్,నెయ్యి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.

2.ఒక వెడల్పాటి గిన్నెలో మైదా వేసి దానిలో మెల్లిగా పెరుగు వేస్తూ చపాతీ పిండిలా కలపాలి.

3.ఈ కలిపిన పిండిని పది నిమిషాలు నాననివ్వాలి.

4.గిన్నెలో నీళ్ళు తీసుకుని దానిలో పంచదార వేసి పంచదార పాకం వచ్చేంతవరకూ మరిగించాలి.పాకం తయారీలో స్టౌ మంట సన్నగా ఉండాలి.పల్చటి సిరప్ లా అయ్యేవరకూ నీళ్ళూ పంచదార మీశ్రమాన్ని స్టౌ మీద ఉంచాలి.


6.పాకం వచ్చాకా స్టౌ కట్టేసి ఏలకుల పొడి కలపాలి.

7.కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్యాటీస్ లాగ చెయ్యాలి.కావాలనుకుంటే ప్యాటీల చివర్లు లోపలకి మడిచి అందంగా కూడా తయారుచేసుకోవచ్చు.

8.మూకుడులో నూనె వేడి చేసి,ఈ ప్యాటీలని మెల్లిగా నూనెలో వెయ్యాలి.

9.సన్నని సెగ మీద బాదూషా పూర్తిగా వేగేవరకూ వేయించుకోవాలి.

10.బ్రౌన్ కలర్ వచ్చాకా బాదూషా ని నూనెలో నుండి తీసి 2-3 నిమిషాలు పక్కన ఉంచాలి.

11.పక్కన పెట్టుకున్న బాదుషాలని పంచదార పాకంలో వేసి రాత్రంతా నాననివ్వాలి.

12.మరునాడు డ్రై ఫ్రూట్స్ తో అలకరించుకుని ఈ నవరాత్రుల్లో నోరూరించే బాదుషాని ఆస్వాదించండి.




Click it and Unblock the Notifications